పెద్ద శంకరంపేట్లో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం
పెద్ద శంకరంపేట్లో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం
Sthanikam joint District Staff Reporter krishna
పెద్ద శంకరంపేట్ మండలంలోని ఎ గ్రామంలో జాతీయ బిసి సెక్రటరీ విగ్రహం రాజన్న గౌడ్ సూచన మేరకు ఆలయ నిర్మాణ దాత విగ్రహం రాజన్న గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా కళ్ళు గీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అంజా గౌడ్, జిల్లా కమిటీ సభ్యుడు నరసింహ గౌడ్, నిజాంపేట్ సొసైటీ ఉపాధ్యక్షుడు ప్రతాప్ గౌడ్, ఉపాధ్యాయుడు భాస్కర్ గౌడ్, గంగారాం సింగ్, ఇస్మాయిల్, రవి, శ్రీకాంత్ గౌడ్, నిజాంపేట్ మండల నాయకులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు సమైక్యతను పెంపొందిస్తాయని పలువురు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని వారు తెలిపారు.అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో విగ్రహాన్ని ప్రతిష్టాపించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి