పవిత్రక్షేత్రాల దర్శనం – నైమిశారణ్య యాత్రకు ఆహ్వానం
పవిత్రక్షేత్రాల దర్శనం – నైమిశారణ్య యాత్రకు ఆహ్వానం
Krishna
జగద్గురు తుకారాం మహారాజ్ 375వ వైకుంఠ గమన సందర్భంగా నైమిశారణ్య పాండురంగ స్వామి సేవా మండలి ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేక తీర్థయాత్రలు నిర్వహించనున్నారు. మే 7 నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో రామమందిర సేవతో ప్రారంభోత్సవం జరుగుతుంది. మే 8న సాయంత్రం మయూర్ కార్యక్రమం, మే 9న ప్రయాగరాజ్ స్నానం, కాశీ విశ్వనాథ దర్శనం, గంగా హారతి, మే 10న అయోధ్య దర్శనం, మే 11న నైమిశారణ్యంలో పాండురంగ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తదుపరి రోజుల్లో గాధలు, ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తారు.ఈ యాత్రలో భక్తులకు భోజనం, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పించబడతాయి. యాత్రలో పాల్గొనదలచిన వారు ముందుగా నమోదు చేసుకోవాలని, పరిమిత స్థానాలు మాత్రమే ఉన్నందున త్వరగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ యాత్ర ద్వారా పవిత్రక్షేత్రాల దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక శాంతిని పొందే మంచి అవకాశం లభిస్తుంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి