Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:17 AM

పట్టువస్త్రాలతో నల్లపోచమ్మకు విశేష పూజలు నిర్వహించిన అర్చకులు

పట్టువస్త్రాలతో నల్లపోచమ్మకు విశేష పూజలు నిర్వహించిన అర్చకులు

పట్టువస్త్రాలతో నల్లపోచమ్మకు విశేష పూజలు నిర్వహించిన అర్చకులు
27-04-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు వారాల మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. మహోత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం ఆలయ అర్చకులు నాగేష్ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పట్టువస్త్రాలు సమర్పించి, విశేష ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మహోత్సవాల సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లు చేపట్టారు. ఈ వేడుకలు మరిన్ని రోజులు భక్తి ఉత్సాహాల మధ్య కొనసాగనున్నాయి.

Sthanikam

పట్టువస్త్రాలతో నల్లపోచమ్మకు విశేష పూజలు నిర్వహించిన అర్చకులు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు వారాల మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. మహోత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం ఆలయ అర్చకులు నాగేష్ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పట్టువస్త్రాలు సమర్పించి, విశేష ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మహోత్సవాల సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లు చేపట్టారు. ఈ వేడుకలు మరిన్ని రోజులు భక్తి ఉత్సాహాల మధ్య కొనసాగనున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News