PRINT TIME: April 27, 2026 10:37 AM
పట్టువస్త్రాలతో నల్లపోచమ్మకు విశేష పూజలు నిర్వహించిన అర్చకులు
పట్టువస్త్రాలతో నల్లపోచమ్మకు విశేష పూజలు నిర్వహించిన అర్చకులు
April 27, 2026 07:41 AM
30 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు వారాల మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. మహోత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం ఆలయ అర్చకులు నాగేష్ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పట్టువస్త్రాలు సమర్పించి, విశేష ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మహోత్సవాల సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లు చేపట్టారు. ఈ వేడుకలు మరిన్ని రోజులు భక్తి ఉత్సాహాల మధ్య కొనసాగనున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి