Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుంకుడు పాములలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 10:37 AM

పట్టువస్త్రాలతో నల్లపోచమ్మకు విశేష పూజలు నిర్వహించిన అర్చకులు

పట్టువస్త్రాలతో నల్లపోచమ్మకు విశేష పూజలు నిర్వహించిన అర్చకులు

పట్టువస్త్రాలతో నల్లపోచమ్మకు విశేష పూజలు నిర్వహించిన అర్చకులు
April 27, 2026 07:41 AM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు వారాల మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. మహోత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం ఆలయ అర్చకులు నాగేష్ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పట్టువస్త్రాలు సమర్పించి, విశేష ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మహోత్సవాల సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లు చేపట్టారు. ఈ వేడుకలు మరిన్ని రోజులు భక్తి ఉత్సాహాల మధ్య కొనసాగనున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News