Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాయం చేయండి – కలెక్టర్‌ను ఆశ్రయించిన ఐకేపీ వివో జూలైలోనే పీఎం కిసాన్ 23వ విడత?.. రైతులకు ఎదురుచూపులు! 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 07:35 PM

పర్యావరణ హిత చర్యలతోనే భవిష్యత్ సురక్షితం – కలెక్టర్ ప్రావీణ్య

పర్యావరణ హిత చర్యలతోనే భవిష్యత్ సురక్షితం – కలెక్టర్ ప్రావీణ్య

పర్యావరణ హిత చర్యలతోనే భవిష్యత్ సురక్షితం – కలెక్టర్ ప్రావీణ్య
April 21, 2026 06:03 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే సందర్భంగా “99 రోజుల ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికను మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ పాండు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. భూమిని కాపాడుకోవడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పచ్చదనాన్ని పెంపొందించడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమన్నారు. ప్రకృతి సంపదను సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణహిత వస్తువులను వినియోగించడం, చెట్ల పెంపకం చేపట్టడం, నీటి వనరులను కాపాడుకోవడం వంటి చర్యలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, యువత పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని, అందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే భూమి సంరక్షణ సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, నేషనల్ గ్రీన్ కార్ప్స్ జిల్లా సమన్వయ కర్త మాధవ రెడ్డి, ఎస్‌జిఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News