Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 28, 2026 09:42 PM

పర్వతాపురంలో రూ.40 లక్షల సిమెంట్ రోడ్ పనుల ప్రారంభం

పర్వతాపురంలో రూ.40 లక్షల సిమెంట్ రోడ్ పనుల ప్రారంభం

పర్వతాపురంలో రూ.40 లక్షల సిమెంట్ రోడ్ పనుల ప్రారంభం
February 28, 2026 08:10 PM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిమెంట్ రోడ్ పనులను శనివారం ప్రారంభించారు. చెక్‌పోస్ట్ వద్ద నుంచి పాత బజారు వరకు, అలాగే ముదిరాజుల బజారు ప్రాంతంలో ఈ పనులు చేపడుతున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షురాలు బొర్రా నాగ మల్లేశ్వరి, మండల టీడీపీ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు, క్లస్టర్-1 ఇంచార్జి ఉయ్యాలా దిలీప్ కుమార్, గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరావు పాల్గొన్నారు.అలాగే నాగరాజు, కల్యాణరావు, రమేష్, చొప్పరపు నాగేశ్వరావు, మిద్దె ధోని శ్రీమన్నారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ రహదారి పనులు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News