పర్వతాపురం గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
పర్వతాపురం గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. గ్రామంలో సుమారు రూ.4 లక్షల వ్యయంతో సిసి రోడ్లు మంజూరయ్యాయి.
ఈ పనులు మంత్రి కొలుసు పార్థసారధి ఆదేశాల మేరకు ప్రారంభమయ్యాయి. గ్రామంలో బురద రోడ్లు లేకుండా చేసి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించడమే లక్ష్యంగా సిసి రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. గ్రామ టిడిపి అధ్యక్షురాలు బొర్రా నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. చాట్రాయి మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు, క్లస్టర్ వన్ ఇంచార్జి ఉయ్యాల దిలీప్, టీడీపీ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరరావు ల పర్యవేక్షణలో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని మౌలిక వసతుల పనులు చేపట్టనున్నట్లు స్థానిక నాయకులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి