Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత ఇసుక పాలసీ దుర్వినియోగంపై కఠిన హెచ్చరికలు కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 04:39 PM

పర్వతాపురం గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

పర్వతాపురం గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

పర్వతాపురం గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
March 03, 2026 06:45 PM 193 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. గ్రామంలో సుమారు రూ.4 లక్షల వ్యయంతో సిసి రోడ్లు మంజూరయ్యాయి.

ఈ పనులు మంత్రి కొలుసు పార్థసారధి ఆదేశాల మేరకు ప్రారంభమయ్యాయి. గ్రామంలో బురద రోడ్లు లేకుండా చేసి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించడమే లక్ష్యంగా సిసి రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. గ్రామ టిడిపి అధ్యక్షురాలు బొర్రా నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. చాట్రాయి మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు, క్లస్టర్ వన్ ఇంచార్జి ఉయ్యాల దిలీప్, టీడీపీ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరరావు ల పర్యవేక్షణలో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని మౌలిక వసతుల పనులు చేపట్టనున్నట్లు స్థానిక నాయకులు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News