ప్రతి వాహనదారుడు బాధ్యతగా ఉండాలి: ఎస్సై సూచన
ప్రతి వాహనదారుడు బాధ్యతగా ఉండాలి: ఎస్సై సూచన
Krishna
సంగారెడ్డి జిల్లా వట్పల్లి పరిధిలో ప్రతి వాహనదారుడు తన వాహనానికి సంబంధించిన అన్ని ధృవపత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని వట్టిపల్లి ఎస్సై లవ కుమార్ తెలిపారు. రోడ్లపై ప్రయాణించే సమయంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు మరియు ఇతర వాహనదారులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా వాహనదారులు ఇన్సూరెన్స్, ఆర్సీ బుక్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు లేకుండా ప్రయాణిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణాలను రక్షించుకోవచ్చని సూచించారు. అలాగే వాహనాలకు ఇన్సూరెన్స్ ఉండటం అత్యంత అవసరమని, ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన వారు లేదా మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంలో ఇన్సూరెన్స్ కీలకంగా ఉంటుందని తెలిపారు. ఇతరులకు ప్రమాదం కలిగించిన సందర్భంలో కూడా ఇన్సూరెన్స్ ద్వారా నష్టపరిహారం చెల్లించేందుకు సహాయపడుతుందని చెప్పారు. అందువల్ల ప్రతి వాహనదారుడు తన వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకోవడంతో పాటు సమయానికి రీన్యువల్ చేసుకోవాలని, రోడ్లపై సురక్షితంగా ప్రయాణించేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి