Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:08 PM

ప్రతి వాహనదారుడు బాధ్యతగా ఉండాలి: ఎస్సై సూచన

ప్రతి వాహనదారుడు బాధ్యతగా ఉండాలి: ఎస్సై సూచన

ప్రతి వాహనదారుడు బాధ్యతగా ఉండాలి: ఎస్సై సూచన
April 16, 2026 03:47 PM 202 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి పరిధిలో ప్రతి వాహనదారుడు తన వాహనానికి సంబంధించిన అన్ని ధృవపత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని వట్టిపల్లి ఎస్సై లవ కుమార్ తెలిపారు. రోడ్లపై ప్రయాణించే సమయంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు మరియు ఇతర వాహనదారులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా వాహనదారులు ఇన్సూరెన్స్, ఆర్‌సీ బుక్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు లేకుండా ప్రయాణిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణాలను రక్షించుకోవచ్చని సూచించారు. అలాగే వాహనాలకు ఇన్సూరెన్స్ ఉండటం అత్యంత అవసరమని, ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన వారు లేదా మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంలో ఇన్సూరెన్స్ కీలకంగా ఉంటుందని తెలిపారు. ఇతరులకు ప్రమాదం కలిగించిన సందర్భంలో కూడా ఇన్సూరెన్స్ ద్వారా నష్టపరిహారం చెల్లించేందుకు సహాయపడుతుందని చెప్పారు. అందువల్ల ప్రతి వాహనదారుడు తన వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకోవడంతో పాటు సమయానికి రీన్యువల్ చేసుకోవాలని, రోడ్లపై సురక్షితంగా ప్రయాణించేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News