Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికి రోజూ రెండు గంటల మంజీరా నీరు లక్ష్యం పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 10:54 PM

ప్రతి ఇంటికి రోజూ రెండు గంటల మంజీరా నీరు లక్ష్యం

ప్రతి ఇంటికి రోజూ రెండు గంటల మంజీరా నీరు లక్ష్యం

ప్రతి ఇంటికి రోజూ రెండు గంటల మంజీరా నీరు లక్ష్యం
April 25, 2026 09:14 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి ప్రజలకు రోజూ రెండు గంటల స్వచ్ఛమైన మంచినీటి సరఫరా కోసం రూ.200 కోట్ల మంజీరా వాటర్ స్కీమ్ విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డి పట్టణానికి మంజీరా నీటి సరఫరాపై మున్సిపల్, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, గతంలో ప్రజలు నీటి కోసం గుంతల్లోకి దిగాల్సిన పరిస్థితి ఉండేదని, ఆ సమస్యను పరిష్కరించేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.230 కోట్లతో మంజీరా వాటర్ స్కీమ్ ఏర్పాటు చేయించామని గుర్తుచేశారు.ప్రస్తుతం పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 50 ఏళ్లకు సరిపడేలా నీటి సరఫరా వ్యవస్థను విస్తరించేందుకు అదనపు ఇంటేక్ వెల్, 8 కొత్త ట్యాంకులు, కొత్త ఫిల్టర్ బెడ్, 1800 కిలోలీటర్ల సంప్, 50 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ నిర్మాణం ప్రతిపాదించామని తెలిపారు. ఆదర్శ్ నగర్, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ పార్క్, రెవెన్యూ కాలనీ, సాయి నగర్, చింతపల్లి తదితర ప్రాంతాల్లో ట్యాంకులు నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రజల అభిప్రాయాలు సేకరించి వచ్చే నెల 5వ తేదీ లోపు పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసి, టెండర్లు పూర్తి అనంతరం 2027లో పనులు ప్రారంభించి 2028 నాటికి పూర్తిచేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.సంగారెడ్డి పట్టణంలో ఎక్కడా నీటి కోసం గుంతలు త్రవ్వాల్సిన పరిస్థితి లేకుండా ప్రతి ఇంటికి పుష్కలంగా మంజీరా నీరు అందేలా చర్యలు తీసుకుంటామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News