Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:11 AM

ప్రతి ఇంటికి రోజూ రెండు గంటల మంజీరా నీరు లక్ష్యం

ప్రతి ఇంటికి రోజూ రెండు గంటల మంజీరా నీరు లక్ష్యం

ప్రతి ఇంటికి రోజూ రెండు గంటల మంజీరా నీరు లక్ష్యం
25-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి ప్రజలకు రోజూ రెండు గంటల స్వచ్ఛమైన మంచినీటి సరఫరా కోసం రూ.200 కోట్ల మంజీరా వాటర్ స్కీమ్ విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డి పట్టణానికి మంజీరా నీటి సరఫరాపై మున్సిపల్, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, గతంలో ప్రజలు నీటి కోసం గుంతల్లోకి దిగాల్సిన పరిస్థితి ఉండేదని, ఆ సమస్యను పరిష్కరించేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.230 కోట్లతో మంజీరా వాటర్ స్కీమ్ ఏర్పాటు చేయించామని గుర్తుచేశారు.ప్రస్తుతం పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 50 ఏళ్లకు సరిపడేలా నీటి సరఫరా వ్యవస్థను విస్తరించేందుకు అదనపు ఇంటేక్ వెల్, 8 కొత్త ట్యాంకులు, కొత్త ఫిల్టర్ బెడ్, 1800 కిలోలీటర్ల సంప్, 50 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ నిర్మాణం ప్రతిపాదించామని తెలిపారు. ఆదర్శ్ నగర్, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ పార్క్, రెవెన్యూ కాలనీ, సాయి నగర్, చింతపల్లి తదితర ప్రాంతాల్లో ట్యాంకులు నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రజల అభిప్రాయాలు సేకరించి వచ్చే నెల 5వ తేదీ లోపు పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసి, టెండర్లు పూర్తి అనంతరం 2027లో పనులు ప్రారంభించి 2028 నాటికి పూర్తిచేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.సంగారెడ్డి పట్టణంలో ఎక్కడా నీటి కోసం గుంతలు త్రవ్వాల్సిన పరిస్థితి లేకుండా ప్రతి ఇంటికి పుష్కలంగా మంజీరా నీరు అందేలా చర్యలు తీసుకుంటామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

Sthanikam

ప్రతి ఇంటికి రోజూ రెండు గంటల మంజీరా నీరు లక్ష్యం

Article Image

సంగారెడ్డి ప్రజలకు రోజూ రెండు గంటల స్వచ్ఛమైన మంచినీటి సరఫరా కోసం రూ.200 కోట్ల మంజీరా వాటర్ స్కీమ్ విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డి పట్టణానికి మంజీరా నీటి సరఫరాపై మున్సిపల్, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, గతంలో ప్రజలు నీటి కోసం గుంతల్లోకి దిగాల్సిన పరిస్థితి ఉండేదని, ఆ సమస్యను పరిష్కరించేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.230 కోట్లతో మంజీరా వాటర్ స్కీమ్ ఏర్పాటు చేయించామని గుర్తుచేశారు.ప్రస్తుతం పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 50 ఏళ్లకు సరిపడేలా నీటి సరఫరా వ్యవస్థను విస్తరించేందుకు అదనపు ఇంటేక్ వెల్, 8 కొత్త ట్యాంకులు, కొత్త ఫిల్టర్ బెడ్, 1800 కిలోలీటర్ల సంప్, 50 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ నిర్మాణం ప్రతిపాదించామని తెలిపారు. ఆదర్శ్ నగర్, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ పార్క్, రెవెన్యూ కాలనీ, సాయి నగర్, చింతపల్లి తదితర ప్రాంతాల్లో ట్యాంకులు నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రజల అభిప్రాయాలు సేకరించి వచ్చే నెల 5వ తేదీ లోపు పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసి, టెండర్లు పూర్తి అనంతరం 2027లో పనులు ప్రారంభించి 2028 నాటికి పూర్తిచేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.సంగారెడ్డి పట్టణంలో ఎక్కడా నీటి కోసం గుంతలు త్రవ్వాల్సిన పరిస్థితి లేకుండా ప్రతి ఇంటికి పుష్కలంగా మంజీరా నీరు అందేలా చర్యలు తీసుకుంటామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News