Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 27, 2026 09:19 PM

ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు

ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు

 ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు
February 27, 2026 07:30 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యదాద్రి భువనగిరి జిల్లాఅదనపు కలెక్టర్ భాస్కర్ రావు.

యదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని శుక్రవారం మోత్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ...మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా,పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు.పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను,సీసీ కెమెరా వ్యవస్థను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం,హాల్ టికెట్ల తనిఖీ,బందోబస్తు ఏర్పాట్లు తదితర విషయాలపై ఆరా తీశారు.ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా చూడాలన్నారు.మాల్ ప్రాక్టీస్ కి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జవాబు పత్రాల రవాణాకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పరీక్షలు పూర్తయ్యేంతవరకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News