Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 04:48 PM

ప్రజావాణిలో 49 దరఖాస్తుల స్వీకరణ – త్వరిత పరిష్కారానికి ఆదేశాలు

ప్రజావాణిలో 49 దరఖాస్తుల స్వీకరణ – త్వరిత పరిష్కారానికి ఆదేశాలు

ప్రజావాణిలో 49 దరఖాస్తుల స్వీకరణ – త్వరిత పరిష్కారానికి ఆదేశాలు
March 23, 2026 06:46 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతి కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి మొత్తం 49 దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతగా పరిగణించి సంబంధిత శాఖ అధికారులు నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కారం చూపాలని సూచించారు.ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసే వేదికగా ప్రజావాణి కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.ప్రజలకు పారదర్శకంగా,జవాబుదారీతనంతో సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అధికారులు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించగా, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News