ప్రజావాణిలో 49 దరఖాస్తుల స్వీకరణ – త్వరిత పరిష్కారానికి ఆదేశాలు
ప్రజావాణిలో 49 దరఖాస్తుల స్వీకరణ – త్వరిత పరిష్కారానికి ఆదేశాలు
Krishna
ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతి కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి మొత్తం 49 దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతగా పరిగణించి సంబంధిత శాఖ అధికారులు నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కారం చూపాలని సూచించారు.ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసే వేదికగా ప్రజావాణి కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.ప్రజలకు పారదర్శకంగా,జవాబుదారీతనంతో సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అధికారులు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించగా, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి