Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 10:29 PM

ప్రజావాణి ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ప్రాధాన్యత

ప్రజావాణి ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ప్రాధాన్యత

ప్రజావాణి ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ప్రాధాన్యత
March 02, 2026 04:57 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడంపై జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ప్రత్యేక దృష్టి సారించారు.ప్రజల సమస్యలను సమీక్షించి, సంబంధిత అధికారుల చొరవ ద్వారా త్వరితగతిన పరిష్కరించాలి అని సూచించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు చేరుకుని తమ సమస్యలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు, నారాయణఖేడ్, సబ్ కలెక్టర్లు ఉమహారతి కలిసి వినతులను స్వీకరించారు.వినతుల్లో భూ సమస్యలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, విద్య, వైద్య ఆరోగ్య, డబ్ల్యూ ఓ, డీసీ ఎస్ ఓ, పశుసంవర్ధక శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. కలెక్టర్ ఈ సమస్యలను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాల్సినవి అని ఆదేశించారు.ఈ సందర్భంగా మొత్తం 56 అర్జీలు అందినట్లు తెలిపారు.కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను గమనించి, వాటిని తక్షణమే పరిష్కరించడం ముఖ్యమైన బాధ్యత అని, అధికారులు ఎల్లప్పుడూ ప్రజల సమస్యలపై శ్రద్ధ చూపించాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓలు, మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం, అవగాహన, మరియు అధికారుల చురుకైన సహకారం నిర్ధారించబడింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News