ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – అవగాహన సదస్సులో మంత్రి ,ఖేఢ్ ఎమ్మెల్యే
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – అవగాహన సదస్సులో మంత్రి ,ఖేఢ్ ఎమ్మెల్యే
Krishna
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించి విజయవంతంగా ముగించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ,నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయేందుకు మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను చేపట్టిన విషయం తెలిసిందే.ఈ కార్యక్రమంలో విద్య, వైద్యం,వ్యవసాయం,గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాలు తదితర పది ముఖ్య అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ఈ కార్యాచరణ ఫలితాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని అధికారులను కోరారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని తెలిపారు.అనంతరం నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అవగాహన సదస్సుకు విచ్చేసిన ఖేడ్ పట్టణ పురపాలక సభ్యులు, గ్రామ సర్పంచులు శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకుని కార్యక్రమంపై చర్చించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, పురపాలక సభ్యులు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి