Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోచమ్మ దేవాలయం నిర్మాణానికి నాటకమండలి సభ్యుల విరాళం ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 15, 2026 11:03 PM

ప్రజల సమస్యలకు పరిష్కారం… నల్లంపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభం

ప్రజల సమస్యలకు పరిష్కారం… నల్లంపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభం

ప్రజల సమస్యలకు పరిష్కారం… నల్లంపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభం
April 15, 2026 05:42 PM 134 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం నల్లంపల్లి గ్రామంలో ప్రజలకు ఎంతోకాలంగా ఇబ్బందిగా మారిన వీధికి నూతన సీసీ రోడ్డును కాంగ్రెస్ నాయకులు ఘనంగా ప్రారంభించారు. వర్షాకాలంలో బురదతో, వేసవిలో దుమ్ముతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ నిధులతో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ సీసీ రోడ్డుతో గ్రామ ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగనున్నాయని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.ఈ సందర్భంగా తాజా మాజీ సొసైటీ చైర్మన్ బగిలి నాగిశెట్టి పటేల్ మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. దశల వారీగా గ్రామంలోని అన్ని వీధులను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మనయ్య, ఉపసర్పంచ్ కల్పన రమేష్, యాదయ్య, వై అంజయ్య, బసంతి పటేల్, వై నర్సింలు, జి బసంతి, వార్డ్ సభ్యుడు శామ్, ఇతర నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News