Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:16 AM

ప్రజల సమస్యలకు పరిష్కారం… నల్లంపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభం

ప్రజల సమస్యలకు పరిష్కారం… నల్లంపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభం

ప్రజల సమస్యలకు పరిష్కారం… నల్లంపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభం
15-04-2026 213 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం నల్లంపల్లి గ్రామంలో ప్రజలకు ఎంతోకాలంగా ఇబ్బందిగా మారిన వీధికి నూతన సీసీ రోడ్డును కాంగ్రెస్ నాయకులు ఘనంగా ప్రారంభించారు. వర్షాకాలంలో బురదతో, వేసవిలో దుమ్ముతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ నిధులతో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ సీసీ రోడ్డుతో గ్రామ ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగనున్నాయని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.ఈ సందర్భంగా తాజా మాజీ సొసైటీ చైర్మన్ బగిలి నాగిశెట్టి పటేల్ మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. దశల వారీగా గ్రామంలోని అన్ని వీధులను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మనయ్య, ఉపసర్పంచ్ కల్పన రమేష్, యాదయ్య, వై అంజయ్య, బసంతి పటేల్, వై నర్సింలు, జి బసంతి, వార్డ్ సభ్యుడు శామ్, ఇతర నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

Sthanikam

ప్రజల సమస్యలకు పరిష్కారం… నల్లంపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభం

Article Image

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం నల్లంపల్లి గ్రామంలో ప్రజలకు ఎంతోకాలంగా ఇబ్బందిగా మారిన వీధికి నూతన సీసీ రోడ్డును కాంగ్రెస్ నాయకులు ఘనంగా ప్రారంభించారు. వర్షాకాలంలో బురదతో, వేసవిలో దుమ్ముతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ నిధులతో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ సీసీ రోడ్డుతో గ్రామ ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగనున్నాయని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.ఈ సందర్భంగా తాజా మాజీ సొసైటీ చైర్మన్ బగిలి నాగిశెట్టి పటేల్ మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. దశల వారీగా గ్రామంలోని అన్ని వీధులను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మనయ్య, ఉపసర్పంచ్ కల్పన రమేష్, యాదయ్య, వై అంజయ్య, బసంతి పటేల్, వై నర్సింలు, జి బసంతి, వార్డ్ సభ్యుడు శామ్, ఇతర నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News