ప్రజల సమస్యలకు పరిష్కారం… నల్లంపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభం
ప్రజల సమస్యలకు పరిష్కారం… నల్లంపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభం
Krishna
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం నల్లంపల్లి గ్రామంలో ప్రజలకు ఎంతోకాలంగా ఇబ్బందిగా మారిన వీధికి నూతన సీసీ రోడ్డును కాంగ్రెస్ నాయకులు ఘనంగా ప్రారంభించారు. వర్షాకాలంలో బురదతో, వేసవిలో దుమ్ముతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ నిధులతో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ సీసీ రోడ్డుతో గ్రామ ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగనున్నాయని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.ఈ సందర్భంగా తాజా మాజీ సొసైటీ చైర్మన్ బగిలి నాగిశెట్టి పటేల్ మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. దశల వారీగా గ్రామంలోని అన్ని వీధులను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మనయ్య, ఉపసర్పంచ్ కల్పన రమేష్, యాదయ్య, వై అంజయ్య, బసంతి పటేల్, వై నర్సింలు, జి బసంతి, వార్డ్ సభ్యుడు శామ్, ఇతర నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి