Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:17 PM

ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు – కలెక్టర్ స్పష్టం

ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు – కలెక్టర్ స్పష్టం

ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు – కలెక్టర్ స్పష్టం
April 13, 2026 04:42 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన మొత్తం 63 దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు తమ సమస్యలను నమ్మకంతో ప్రజావాణి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నారని, వాటి పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలని, సంక్షేమం, రెవెన్యూ, వ్యవసాయం, గృహనిర్మాణం, మార్కెటింగ్, ఉపాధి తదితర శాఖలకు సంబంధించిన వినతులను అధికారులు ప్రత్యేక దృష్టితో తీసుకుని వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులపై నిర్లక్ష్యం అసలు సహించబోమని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News