ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు – కలెక్టర్ స్పష్టం
ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు – కలెక్టర్ స్పష్టం
Krishna
జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన మొత్తం 63 దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు తమ సమస్యలను నమ్మకంతో ప్రజావాణి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నారని, వాటి పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలని, సంక్షేమం, రెవెన్యూ, వ్యవసాయం, గృహనిర్మాణం, మార్కెటింగ్, ఉపాధి తదితర శాఖలకు సంబంధించిన వినతులను అధికారులు ప్రత్యేక దృష్టితో తీసుకుని వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులపై నిర్లక్ష్యం అసలు సహించబోమని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి