Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:07 PM

ప్రజల కోసం ఉచిత వైద్య సేవలు – శ్రీనగర్ కాలనీలో శిబిరం

ప్రజల కోసం ఉచిత వైద్య సేవలు – శ్రీనగర్ కాలనీలో శిబిరం

ప్రజల కోసం ఉచిత వైద్య సేవలు – శ్రీనగర్ కాలనీలో శిబిరం
April 19, 2026 09:12 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పటాన్‌చెరు విభాగం పరిధిలోని శ్రీనగర్ కాలనీలో మురళీకృష్ణ బెండపూడి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో, యశోద ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం.డి.ఆర్ సేవా సంస్థ సహ వ్యవస్థాపకుడు, బీఆర్ఎస్ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు రక్తపోటు, చక్కెర పరీక్షలు, సాధారణ ఆరోగ్య తనిఖీలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు ప్రతి వర్గానికి వైద్య సేవలు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధులను గుర్తించడం మరియు ఆరోగ్యంపై అవగాహన పెంచడం చాలా అవసరమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి శిబిరాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో నర్సింహ రెడ్డి, సునీత, కృష్ణంరాజు, రవీందర్ గిరి, ఆతీయ సుల్తానా, పవన్, వైద్య సిబ్బంది, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News