ప్రజల కోసం ఉచిత వైద్య సేవలు – శ్రీనగర్ కాలనీలో శిబిరం
ప్రజల కోసం ఉచిత వైద్య సేవలు – శ్రీనగర్ కాలనీలో శిబిరం
Krishna
పటాన్చెరు విభాగం పరిధిలోని శ్రీనగర్ కాలనీలో మురళీకృష్ణ బెండపూడి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో, యశోద ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం.డి.ఆర్ సేవా సంస్థ సహ వ్యవస్థాపకుడు, బీఆర్ఎస్ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు రక్తపోటు, చక్కెర పరీక్షలు, సాధారణ ఆరోగ్య తనిఖీలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు ప్రతి వర్గానికి వైద్య సేవలు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధులను గుర్తించడం మరియు ఆరోగ్యంపై అవగాహన పెంచడం చాలా అవసరమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి శిబిరాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో నర్సింహ రెడ్డి, సునీత, కృష్ణంరాజు, రవీందర్ గిరి, ఆతీయ సుల్తానా, పవన్, వైద్య సిబ్బంది, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి