ప్రజా సమస్యలపై బహుజన సేన సమితి వినతిపత్రం
ప్రజా సమస్యలపై బహుజన సేన సమితి వినతిపత్రం
స్థానికం బృందం
ఎమ్మిగనూరు, పట్టణంలోని ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మున్సిపల్ ఆస్తుల కేటాయింపులో సామాజిక న్యాయం చేయాలని కోరుతూ బహుజన సేన సమితి నాయకులు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, కమిషనర్లకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర విలేకరులతో మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. మున్సిపల్ ఆస్తుల కేటాయింపులో అసమానతలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఎస్ఎమ్టి కాలనీ మెయిన్ రోడ్డును వెంటనే నిర్మించాలన్నారు. అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ షాపులను రీ-టెండర్ వేసి, టెండర్ పొందిన వారే వ్యాపారం నిర్వహించేలా నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కాంప్లెక్స్ షాపులను రీ-టెండర్ చేసి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. షరఫ్ బజార్, చిన్న పార్కు కాంప్లెక్స్ షాపుల కేటాయింపులో మాల సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఎస్సీ, బీసీ, కర్నూల్ రోడ్ స్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, వేసవి నేపథ్యంలో అన్ని వార్డులకు తాగునీటి సరఫరా క్రమబద్ధంగా చేయాలని సూచించారు. కొత్తగా నియమితులైన 11 మంది పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మిలటరీ కాలనీ, మైనార్టీ కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.
సమస్యలను రాబోయే కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాలతో కలిసి మహా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కె. చిన్ని ప్రసాద్, నారాయణ, వెంకటేష్, రామాంజి, వీరభద్ర తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి