Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:44 PM

ప్రజా సమస్యలపై బహుజన సేన సమితి వినతిపత్రం

ప్రజా సమస్యలపై బహుజన సేన సమితి వినతిపత్రం

ప్రజా సమస్యలపై బహుజన సేన సమితి వినతిపత్రం
28-02-2026 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మిగనూరు, పట్టణంలోని ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మున్సిపల్ ఆస్తుల కేటాయింపులో సామాజిక న్యాయం చేయాలని కోరుతూ బహుజన సేన సమితి నాయకులు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, కమిషనర్‌లకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర విలేకరులతో మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. మున్సిపల్ ఆస్తుల కేటాయింపులో అసమానతలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఎస్‌ఎమ్‌టి కాలనీ మెయిన్ రోడ్డును వెంటనే నిర్మించాలన్నారు. అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ షాపులను రీ-టెండర్ వేసి, టెండర్ పొందిన వారే వ్యాపారం నిర్వహించేలా నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కాంప్లెక్స్ షాపులను రీ-టెండర్ చేసి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. షరఫ్ బజార్, చిన్న పార్కు కాంప్లెక్స్ షాపుల కేటాయింపులో మాల సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఎస్సీ, బీసీ, కర్నూల్ రోడ్ స్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, వేసవి నేపథ్యంలో అన్ని వార్డులకు తాగునీటి సరఫరా క్రమబద్ధంగా చేయాలని సూచించారు. కొత్తగా నియమితులైన 11 మంది పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మిలటరీ కాలనీ, మైనార్టీ కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.

సమస్యలను రాబోయే కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాలతో కలిసి మహా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కె. చిన్ని ప్రసాద్, నారాయణ, వెంకటేష్, రామాంజి, వీరభద్ర తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా సమస్యలపై బహుజన సేన సమితి వినతిపత్రం

Article Image

ఎమ్మిగనూరు, పట్టణంలోని ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మున్సిపల్ ఆస్తుల కేటాయింపులో సామాజిక న్యాయం చేయాలని కోరుతూ బహుజన సేన సమితి నాయకులు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, కమిషనర్‌లకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర విలేకరులతో మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. మున్సిపల్ ఆస్తుల కేటాయింపులో అసమానతలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఎస్‌ఎమ్‌టి కాలనీ మెయిన్ రోడ్డును వెంటనే నిర్మించాలన్నారు. అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ షాపులను రీ-టెండర్ వేసి, టెండర్ పొందిన వారే వ్యాపారం నిర్వహించేలా నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కాంప్లెక్స్ షాపులను రీ-టెండర్ చేసి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. షరఫ్ బజార్, చిన్న పార్కు కాంప్లెక్స్ షాపుల కేటాయింపులో మాల సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఎస్సీ, బీసీ, కర్నూల్ రోడ్ స్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, వేసవి నేపథ్యంలో అన్ని వార్డులకు తాగునీటి సరఫరా క్రమబద్ధంగా చేయాలని సూచించారు. కొత్తగా నియమితులైన 11 మంది పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మిలటరీ కాలనీ, మైనార్టీ కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.

సమస్యలను రాబోయే కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాలతో కలిసి మహా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కె. చిన్ని ప్రసాద్, నారాయణ, వెంకటేష్, రామాంజి, వీరభద్ర తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News