Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 08, 2026 01:25 AM

ప్రగతి ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు అవగాహన – కలెక్టర్ ప్రవీణ్య

ప్రగతి ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు అవగాహన – కలెక్టర్ ప్రవీణ్య

ప్రగతి ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు అవగాహన – కలెక్టర్ ప్రవీణ్య
March 11, 2026 05:48 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లాలోని ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఒరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రవీణ్య ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా వివిధ శాఖల ద్వారా 2026 మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్థాయికి సమర్థవంతంగా చేరేలా చర్యలు చేపడతామని చెప్పారు.ఈ నేపథ్యంలో జిల్లాలోని మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, గ్రామ పంచాయతీల సర్పంచులు, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లు ప్రభుత్వ కార్యక్రమాల అమలు విధానం, లక్ష్యాలు మరియు వివిధ శాఖల ఫ్లాగ్‌షిప్ పథకాల గురించి పూర్తిగా అవగాహన పొందేందుకు ఒక రోజు ప్రత్యేక ఒరియంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.ఈ ఒరియంటేషన్ కార్యక్రమం మార్చి 12న (గురువారం) ఉదయం 10 గంటలకు కంది లోని ఎల్.ఎన్. కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించబడుతుందని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టే కార్యక్రమాలు, అభివృద్ధి చర్యలు, అమలు విధానం గురించి ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు.అందువల్ల జిల్లాలోని అన్ని మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, గ్రామ పంచాయతీల సర్పంచులు, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరై ప్రభుత్వ కార్యక్రమాలపై పూర్తి అవగాహన పొందాలని జిల్లా కలెక్టర్ పి. ప్రవీణ్య కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News