ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలి ప్రముఖ న్యాయవాది మఠం విశ్వనాథ్ స్వామి
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలి ప్రముఖ న్యాయవాది మఠం విశ్వనాథ్ స్వామి
Sthanikam joint District Staff Reporter krishna
ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం , పాఠశాల మౌలిక వసతుల కల్పనకై దాతల సహకారం అందించాలని ప్రముఖ న్యాయవాది నాగ్దర్ వాస్తవ్యులు విశ్వనాధ్ స్వామి అన్నారు ..బుధువారం నాడు పాఠశాల వార్షికోత్సవం సందర్బంగా
చంద్రశేఖర్ ఆచార్య కోరిక మేరకు 10వ తరగతి లోని 169 మంది విద్యార్థులకు 20 వేల విలువ కలిగిన పరీక్షా సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను గత ఐదు సంవత్సరాలుగా నాగ్దర్, ర్యాకల్ , కడపల్ జడ్పిహెచ్ఎస్ నారాయణఖేడ్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు విద్యాసామాగ్రి & పరీక్ష సామాగ్రి అందజేస్తున్నానన్నారు .. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం నిరంతరం బాగా చదివి అభివృద్ధి సాధించాలన్నారు . నారాయణఖేడ్ ప్రాంతవాసులు హైదరాబాదులో ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ తమ మాతృభూమికై తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మన్మధ కిషోర్ ,ఉపాధ్యాయులు యాదగిరి, రాజశేఖర్, చంద్రశేఖర్ ఆచార్య , దన్సింగ్, రాజయ్య , జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి