PRINT TIME: April 26, 2026 09:41 PM
ప్రభుత్వ ఆదేశాల మేరకు వాసవి మాత జయంతి నిర్వహణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు వాసవి మాత జయంతి నిర్వహణ
April 26, 2026 07:31 PM
15 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
ప్రభుత్వ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వాసవి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ తహసీల్దార్లు రాజు పటేల్, ఈశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించగా, అధికారులు మరియు సిబ్బంది పాల్గొని వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వాసవి మాత జీవితం, ఆమె చూపిన ధర్మ మార్గం, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో శాంతి, సేవా భావం, సమానత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, సునీత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి