Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి హైస్కూల్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 06:58 PM

పదవి విరమణ అభినందన సభ కార్యక్రమంలో పాల్గొన్న:నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా కమిటీ బృందం

పదవి విరమణ అభినందన సభ కార్యక్రమంలో పాల్గొన్న:నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా కమిటీ బృందం

పదవి విరమణ అభినందన సభ కార్యక్రమంలో పాల్గొన్న:నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా కమిటీ బృందం
February 26, 2026 07:11 PM 325 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలం పరిధిలో గురుజువాడ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం భావోద్వేగభరిత వాతావరణంలో అభినందన సభ జరిగింది.పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా సేవలందించిన బోగరి జిన్ రాజ్ పదవీ విరమణ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.దీర్ఘకాలం పాటు విద్యార్థులకు అంకితభావంతో బోధన చేసి, అనేక మంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చిన జిన్ రాజ్ సేవలను సభలో వక్తలు ప్రశంసించారు. క్రమశిక్షణ, సమయపాలన,విద్యార్థుల పట్ల మమకారం వంటి గుణాలతో ఆయన ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, జహీరాబాద్ విభాగ మహిళా రక్షణ అధ్యక్షురాలు సుమిత్ర, న్యాల్ కల మండల అధ్యక్షులు నవీన్ కుమార్ పాల్గొని జిన్ రాజ్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.వారి సేవలు సమాజానికి మరువలేనివని పేర్కొన్నారు.అలాగే మండల విద్యాశాఖాధికారి,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం, పాఠశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు వీడ్కోలు పలికారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఆయన బోధన శైలి తమ జీవితాల్లో మార్పు తీసుకువచ్చిందని గుర్తుచేసుకున్నారు.సాదాసీదా ఉపాధ్యాయుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, వేలాది మంది విద్యార్థుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచే గురువుగా ముగిసిందని సభలో అభిప్రాయపడ్డారు. పదవీ విరమణ అనంతరం కూడా ఆయన సమాజ సేవలో కొనసాగాలని అందరూ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం గురుజువాడ గ్రామంలో ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గౌరవాన్ని మరోసారి చాటిచెప్పింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News