Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:21 AM

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
23-03-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న శ్రీ సాయి కృష్ణ హై స్కూల్‌లో నిర్వహిస్తున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తరుణంలో అకస్మికంగా తనిఖీ నిర్వహించి, పరీక్షల నిర్వహణపై సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో హాల్ ఏర్పాట్లు,విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సీసీ కెమెరాల అమరిక,భద్రతా చర్యలు వంటి అంశాలను సమీక్షించారు.విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్‌లు, ఇన్విజిలేటర్లు పరీక్షా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.ఎటువంటి అక్రమాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా అనుమతి లేని వ్యక్తులు కేంద్రంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించకూడదని స్పష్టంగా చెప్పారు.అలాగే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రతి విద్యార్థి తన ప్రతిభను పూర్తి స్థాయిలో ప్రదర్శించుకునేలా అనుకూల వాతావరణం కల్పించడం అధికారుల బాధ్యత అని చెప్పారు.పరీక్షల నిర్వహణలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా చోటు చేసుకోకూడదని హెచ్చరించిన కలెక్టర్, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ ఆకస్మిక తనిఖీతో పరీక్షా కేంద్రాల్లో అధికారుల అప్రమత్తత మరింత పెరిగింది.

Sthanikam

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

Article Image

సంగారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న శ్రీ సాయి కృష్ణ హై స్కూల్‌లో నిర్వహిస్తున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తరుణంలో అకస్మికంగా తనిఖీ నిర్వహించి, పరీక్షల నిర్వహణపై సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో హాల్ ఏర్పాట్లు,విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సీసీ కెమెరాల అమరిక,భద్రతా చర్యలు వంటి అంశాలను సమీక్షించారు.విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్‌లు, ఇన్విజిలేటర్లు పరీక్షా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.ఎటువంటి అక్రమాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా అనుమతి లేని వ్యక్తులు కేంద్రంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించకూడదని స్పష్టంగా చెప్పారు.అలాగే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రతి విద్యార్థి తన ప్రతిభను పూర్తి స్థాయిలో ప్రదర్శించుకునేలా అనుకూల వాతావరణం కల్పించడం అధికారుల బాధ్యత అని చెప్పారు.పరీక్షల నిర్వహణలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా చోటు చేసుకోకూడదని హెచ్చరించిన కలెక్టర్, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ ఆకస్మిక తనిఖీతో పరీక్షా కేంద్రాల్లో అధికారుల అప్రమత్తత మరింత పెరిగింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News