Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:19 AM

పదవ తరగతి పలు పరీక్షల కేంద్రాలపై సబ్ కలెక్టర్ ఆకస్మిక పరిశీలన

పదవ తరగతి పలు పరీక్షల కేంద్రాలపై సబ్ కలెక్టర్ ఆకస్మిక పరిశీలన

పదవ తరగతి పలు పరీక్షల కేంద్రాలపై సబ్ కలెక్టర్ ఆకస్మిక పరిశీలన
14-03-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు–2026 విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో నారాయణఖేడ్ పట్టణంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బ్రిలియంట్ హైస్కూల్ మరియు ఈ–తక్షశిలా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను సవివరంగా పరిశీలించారు.పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.పరీక్షా గదుల్లో కూర్చోవడానికి సరైన ఏర్పాట్లు ఉండాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ప్రశ్నాపత్రాల భద్రపరచడం, పరీక్షా నిర్వహణలో పారదర్శకత పాటించడం వంటి అంశాలపై కూడా సిబ్బందికి సూచనలు ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని, ఉపాధ్యాయులు వారికి సహకరించాలని తెలిపారు.ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పదవ తరగతి పలు పరీక్షల కేంద్రాలపై సబ్ కలెక్టర్ ఆకస్మిక పరిశీలన

Article Image

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు–2026 విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో నారాయణఖేడ్ పట్టణంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బ్రిలియంట్ హైస్కూల్ మరియు ఈ–తక్షశిలా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను సవివరంగా పరిశీలించారు.పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.పరీక్షా గదుల్లో కూర్చోవడానికి సరైన ఏర్పాట్లు ఉండాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ప్రశ్నాపత్రాల భద్రపరచడం, పరీక్షా నిర్వహణలో పారదర్శకత పాటించడం వంటి అంశాలపై కూడా సిబ్బందికి సూచనలు ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని, ఉపాధ్యాయులు వారికి సహకరించాలని తెలిపారు.ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News