పదవ తరగతి పలు పరీక్షల కేంద్రాలపై సబ్ కలెక్టర్ ఆకస్మిక పరిశీలన
పదవ తరగతి పలు పరీక్షల కేంద్రాలపై సబ్ కలెక్టర్ ఆకస్మిక పరిశీలన
Sthanikam joint District Staff Reporter krishna
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు–2026 విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో నారాయణఖేడ్ పట్టణంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బ్రిలియంట్ హైస్కూల్ మరియు ఈ–తక్షశిలా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను సవివరంగా పరిశీలించారు.పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.పరీక్షా గదుల్లో కూర్చోవడానికి సరైన ఏర్పాట్లు ఉండాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ప్రశ్నాపత్రాల భద్రపరచడం, పరీక్షా నిర్వహణలో పారదర్శకత పాటించడం వంటి అంశాలపై కూడా సిబ్బందికి సూచనలు ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని, ఉపాధ్యాయులు వారికి సహకరించాలని తెలిపారు.ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి