PRINT TIME: February 28, 2026 02:14 PM
ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్
ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్
February 28, 2026 12:37 PM
2 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని సోమందేపల్లి మండలం స్నేహలత నగర్లో రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా స్నేహలత నగర్కు చెందిన ఖాదర్ బాషా అకాల మరణం చెందడంతో కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయన పెన్షన్ను భార్య అమీనా బీకి బదిలీ చేసి మొదటి నెలలోనే పెన్షన్ అందజేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది.
ఈ కార్యక్రమంలో గ్రామ బూత్ కన్వీనర్ లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకుడు అంజన్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ మద్దిలేటి, కో-కన్వీనర్ రంగనాథం తదితర కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి