Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 28, 2026 02:14 PM

ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్

ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్

ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్
February 28, 2026 12:37 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని సోమందేపల్లి మండలం స్నేహలత నగర్‌లో రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా స్నేహలత నగర్‌కు చెందిన ఖాదర్ బాషా అకాల మరణం చెందడంతో కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయన పెన్షన్‌ను భార్య అమీనా బీకి బదిలీ చేసి మొదటి నెలలోనే పెన్షన్ అందజేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది.

ఈ కార్యక్రమంలో గ్రామ బూత్ కన్వీనర్ లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకుడు అంజన్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ మద్దిలేటి, కో-కన్వీనర్ రంగనాథం తదితర కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News