నూతన ఎంఆర్వో జగన్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నాయకులు
నూతన ఎంఆర్వో జగన్ కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నాయకులు
Sthanikam District Staff Reporter
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన భువనగిరి మండల ఎంఆర్వో(MRO)గా జగన్ ని గెజిటెడ్ ఆఫీసర్స్ జిల్లా ప్రెసిడెంట్గా అభినందిస్తూ..శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎనగండ్ల సుధాకర్ ఆధ్వర్యంలో శుభాకాంక్షల కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉపప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహ మూర్తి,అరుణ్ అయ్యగారు హాజరై ఎంఆర్వో జగన్ ను ఆశీర్వదించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ...భువనగిరి మండల అభివృద్ధికి ఎంఆర్వో జగన్ కృషి చేయాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శక పరిపాలన అందించాలని కోరారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో పరిపాలనా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన ఎంఆర్వోకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి