Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:32 AM

నూజివీడు కోర్టు తీర్పు తర్వాత టీడీపీ నాయకుల ఆనందం

నూజివీడు కోర్టు తీర్పు తర్వాత టీడీపీ నాయకుల ఆనందం

నూజివీడు కోర్టు తీర్పు తర్వాత టీడీపీ నాయకుల ఆనందం
28-02-2026 166 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

14 మంది టీడీపీ నాయకులపై నమోదైన ఎన్నికల కేసు కొట్టివేత

చాట్రాయి 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో చాట్రాయి మండలానికి చెందిన 14 మంది టీడీపీ నాయకులకు ఉపశమనం లభించింది. కేసును కొట్టివేస్తూ నూజివీడు కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.

మండలానికి చెందిన మందలపు జగదీష్ (చీపురుగూడెం), చాగంటి రాధాకృష్ణ (పోలవరం)లతో పాటు నూజివీడు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 14 మంది నాయకులపై ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో 2019లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి చొరవ తీసుకుని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో చర్చించినట్లు తెలిసింది. విచారణను వేగవంతం చేసి పూర్తి చేసిన అనంతరం కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు ఇవ్వడంతో సంబంధిత నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

తీర్పు వెలువడిన వెంటనే కోర్టు ప్రాంగణంలో టీడీపీ నాయకులు ఒకరినొకరు అభినందించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ఈ తీర్పును స్వాగతించాయి.

Sthanikam

నూజివీడు కోర్టు తీర్పు తర్వాత టీడీపీ నాయకుల ఆనందం

Article Image

14 మంది టీడీపీ నాయకులపై నమోదైన ఎన్నికల కేసు కొట్టివేత

చాట్రాయి 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో చాట్రాయి మండలానికి చెందిన 14 మంది టీడీపీ నాయకులకు ఉపశమనం లభించింది. కేసును కొట్టివేస్తూ నూజివీడు కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.

మండలానికి చెందిన మందలపు జగదీష్ (చీపురుగూడెం), చాగంటి రాధాకృష్ణ (పోలవరం)లతో పాటు నూజివీడు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 14 మంది నాయకులపై ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో 2019లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి చొరవ తీసుకుని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో చర్చించినట్లు తెలిసింది. విచారణను వేగవంతం చేసి పూర్తి చేసిన అనంతరం కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు ఇవ్వడంతో సంబంధిత నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

తీర్పు వెలువడిన వెంటనే కోర్టు ప్రాంగణంలో టీడీపీ నాయకులు ఒకరినొకరు అభినందించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ఈ తీర్పును స్వాగతించాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News