నూజివీడు కోర్టు తీర్పు తర్వాత టీడీపీ నాయకుల ఆనందం
నూజివీడు కోర్టు తీర్పు తర్వాత టీడీపీ నాయకుల ఆనందం
GADDAM JAGANMOHAN REDDY
14 మంది టీడీపీ నాయకులపై నమోదైన ఎన్నికల కేసు కొట్టివేత
చాట్రాయి 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో చాట్రాయి మండలానికి చెందిన 14 మంది టీడీపీ నాయకులకు ఉపశమనం లభించింది. కేసును కొట్టివేస్తూ నూజివీడు కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.
మండలానికి చెందిన మందలపు జగదీష్ (చీపురుగూడెం), చాగంటి రాధాకృష్ణ (పోలవరం)లతో పాటు నూజివీడు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 14 మంది నాయకులపై ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో 2019లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి చొరవ తీసుకుని పబ్లిక్ ప్రాసిక్యూటర్తో చర్చించినట్లు తెలిసింది. విచారణను వేగవంతం చేసి పూర్తి చేసిన అనంతరం కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు ఇవ్వడంతో సంబంధిత నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
తీర్పు వెలువడిన వెంటనే కోర్టు ప్రాంగణంలో టీడీపీ నాయకులు ఒకరినొకరు అభినందించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ఈ తీర్పును స్వాగతించాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి