నిరుపేదల పట్ల సేవాభావంతో ముందుకు వస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్
నిరుపేదల పట్ల సేవాభావంతో ముందుకు వస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోమనూర్ మండలం బోరంచ గ్రామంలో మోమిడి జహీద బేగం కుటుంబానికి రంజాన్ పండుగ సందర్భంగా జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం అందించారు.పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నెలకు సరిపడా నిత్యవసర సరుకులు మరియు కొంత నగదు సహాయాన్ని అందజేశారు.ఈ సహాయ కార్యక్రమం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ సూచనల మేరకు నిర్వహించబడింది. గ్రామంలోని పేద కుటుంబాలకు తోడ్పాటు అందిస్తూ వారి జీవన విధానాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిందోల్ సంగారెడ్డి, మొట్లకుంట నర్సింలు, అలాగే జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు అభి పవర్, చాకలి సత్యన్న, కొత్తకపు పాండురంగారెడ్డి, పుట్టి శివన్న, పాలడుగు రాములు, పాలడుగు పండరి, విఠల్, మొట్లకుంట లింగం, బదర్గం లింగం, బెయింట్ల మోహన్, జంగం రుద్రయ్య, దేవనూర్ మాణిక్యయ్య, చాకలి మహిపాల్, చాకలి భూమయ్య, ఎర్ర శ్రీశెలం, పేదనోళ్ల మల్లేష్, బొక్క ఇస్మాయిల్,డాంగే అయ్యము,చెట్టుకింది సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి