నిర్లక్ష్యం బలి అయిన పశువు – కుసునూరులో విషాద ఘటన
నిర్లక్ష్యం బలి అయిన పశువు – కుసునూరులో విషాద ఘటన
Krishna
రైయికోడ్ మండలం పరిధిలోని కుసునూరు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు గోపాల్ రెడ్డికి చెందిన ఎద్దు విషపూరిత ద్రావణం తాగి మృతి చెందింది. గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న బోర్ వద్ద ఒక డ్రమ్ములో యూరియా కలిపిన గడ్డి మందు నిర్లక్ష్యంగా ఉంచినట్లు సమాచారం. దాహంతో ఉన్న ఎద్దు ఆ ద్రావణాన్ని తాగడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ డ్రమ్మును గ్రామానికి చెందిన ఈర్స సంగణ పటేల్ ఉంచినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆయన మాత్రం తనకు సంబంధం లేదని చెప్పడంతో పాటు బాధితులను బెదిరించినట్లు కుటుంబ సభ్యులు వాపోతున్నారు.ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ రాజశేఖర్ స్పందించకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎద్దు మృతి చెందడంతో గోపాల్ రెడ్డి కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. వ్యవసాయానికి ముఖ్యమైన ఎద్దును కోల్పోవడంతో వారు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే దహన సంస్కారాలు నిర్వహించిన కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. బాధిత కుటుంబానికి తక్షణం నష్టపరిహారం అందించాలని, నిర్లక్ష్యంగా విషపదార్థం ఉంచిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి