Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలించలేదు బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 09:47 PM

నిర్లక్ష్యం బలి అయిన పశువు – కుసునూరులో విషాద ఘటన

నిర్లక్ష్యం బలి అయిన పశువు – కుసునూరులో విషాద ఘటన

నిర్లక్ష్యం బలి అయిన పశువు – కుసునూరులో విషాద ఘటన
April 21, 2026 08:02 PM 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రైయికోడ్ మండలం పరిధిలోని కుసునూరు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు గోపాల్ రెడ్డికి చెందిన ఎద్దు విషపూరిత ద్రావణం తాగి మృతి చెందింది. గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న బోర్ వద్ద ఒక డ్రమ్ములో యూరియా కలిపిన గడ్డి మందు నిర్లక్ష్యంగా ఉంచినట్లు సమాచారం. దాహంతో ఉన్న ఎద్దు ఆ ద్రావణాన్ని తాగడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ డ్రమ్మును గ్రామానికి చెందిన ఈర్స సంగణ పటేల్ ఉంచినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆయన మాత్రం తనకు సంబంధం లేదని చెప్పడంతో పాటు బాధితులను బెదిరించినట్లు కుటుంబ సభ్యులు వాపోతున్నారు.ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ రాజశేఖర్ స్పందించకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎద్దు మృతి చెందడంతో గోపాల్ రెడ్డి కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. వ్యవసాయానికి ముఖ్యమైన ఎద్దును కోల్పోవడంతో వారు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే దహన సంస్కారాలు నిర్వహించిన కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. బాధిత కుటుంబానికి తక్షణం నష్టపరిహారం అందించాలని, నిర్లక్ష్యంగా విషపదార్థం ఉంచిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News