Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:10 PM

నిర్లక్ష్యం బలి అయిన పశువు – కుసునూరులో విషాద ఘటన

నిర్లక్ష్యం బలి అయిన పశువు – కుసునూరులో విషాద ఘటన

నిర్లక్ష్యం బలి అయిన పశువు – కుసునూరులో విషాద ఘటన
April 21, 2026 08:02 PM 186 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రైయికోడ్ మండలం పరిధిలోని కుసునూరు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు గోపాల్ రెడ్డికి చెందిన ఎద్దు విషపూరిత ద్రావణం తాగి మృతి చెందింది. గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న బోర్ వద్ద ఒక డ్రమ్ములో యూరియా కలిపిన గడ్డి మందు నిర్లక్ష్యంగా ఉంచినట్లు సమాచారం. దాహంతో ఉన్న ఎద్దు ఆ ద్రావణాన్ని తాగడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ డ్రమ్మును గ్రామానికి చెందిన ఈర్స సంగణ పటేల్ ఉంచినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆయన మాత్రం తనకు సంబంధం లేదని చెప్పడంతో పాటు బాధితులను బెదిరించినట్లు కుటుంబ సభ్యులు వాపోతున్నారు.ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ రాజశేఖర్ స్పందించకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎద్దు మృతి చెందడంతో గోపాల్ రెడ్డి కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. వ్యవసాయానికి ముఖ్యమైన ఎద్దును కోల్పోవడంతో వారు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే దహన సంస్కారాలు నిర్వహించిన కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. బాధిత కుటుంబానికి తక్షణం నష్టపరిహారం అందించాలని, నిర్లక్ష్యంగా విషపదార్థం ఉంచిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News