నిజాయితీకి నిదర్శనం – తులం బంగారం పోలీసులకు అప్పగించిన యువకుడు
నిజాయితీకి నిదర్శనం – తులం బంగారం పోలీసులకు అప్పగించిన యువకుడు
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధిలోని తుర్కవర్గాం గ్రామానికి చెందిన సింగే మచ్చేందర్ (తండ్రి: మారెప్ప) నిజాయితీ అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా నిలిచింది.సింగే మచ్చేందర్ కంగ్టి పట్టణంలోని నిర్మల ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం వెళ్లిన సమయంలో అక్కడ ఒక తెలియని కవర్ కనిపించింది. అనుమానం కలిగి ఆ కవర్ను తీసి చూడగా అందులో ఒక తులం బంగారం కమ్మలు ఉన్నాయని గమనించాడు. ఆభరణాలు ఎవరో కోల్పోయి ఉంటారని భావించి, స్వార్థపరంగా వ్యవహరించకుండా వెంటనే వాటిని కంగ్టి పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించాడు.పోలీసులు ఆ విషయాన్ని స్వీకరించి విచారణ చేపట్టగా, ఆ బంగారం కమ్మలు దుర్గారాజు (తండ్రి: మొగులయ్య) వని గుర్తించారు. వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి వచ్చిన సమయంలో అనుకోకుండా ఆభరణాలు పోగొట్టుకున్నట్లు తెలిసింది.నిజాయితీతో ఆభరణాలు పోలీసులకు అప్పగించిన సింగే మచ్చేందర్ను పోలీసు అధికారి శాలువాతో సన్మానించి అభినందించారు.సమాజంలో ఇలాంటి నిజాయితీ గల వ్యక్తులు ఉండటం గర్వకారణం. సింగే మచ్చేందర్ చేసిన ఈ మంచిపని, బాధ్యతాయుతమైన ప్రవర్తన ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి