Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 04:06 AM

నిజాయితీకి నిదర్శనం – తులం బంగారం పోలీసులకు అప్పగించిన యువకుడు

నిజాయితీకి నిదర్శనం – తులం బంగారం పోలీసులకు అప్పగించిన యువకుడు

నిజాయితీకి నిదర్శనం – తులం బంగారం పోలీసులకు అప్పగించిన యువకుడు
01-03-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధిలోని తుర్కవర్గాం గ్రామానికి చెందిన సింగే మచ్చేందర్ (తండ్రి: మారెప్ప) నిజాయితీ అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా నిలిచింది.సింగే మచ్చేందర్ కంగ్టి పట్టణంలోని నిర్మల ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం వెళ్లిన సమయంలో అక్కడ ఒక తెలియని కవర్ కనిపించింది. అనుమానం కలిగి ఆ కవర్‌ను తీసి చూడగా అందులో ఒక తులం బంగారం కమ్మలు ఉన్నాయని గమనించాడు. ఆభరణాలు ఎవరో కోల్పోయి ఉంటారని భావించి, స్వార్థపరంగా వ్యవహరించకుండా వెంటనే వాటిని కంగ్టి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు.పోలీసులు ఆ విషయాన్ని స్వీకరించి విచారణ చేపట్టగా, ఆ బంగారం కమ్మలు దుర్గారాజు (తండ్రి: మొగులయ్య) వని గుర్తించారు. వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి వచ్చిన సమయంలో అనుకోకుండా ఆభరణాలు పోగొట్టుకున్నట్లు తెలిసింది.నిజాయితీతో ఆభరణాలు పోలీసులకు అప్పగించిన సింగే మచ్చేందర్‌ను పోలీసు అధికారి శాలువాతో సన్మానించి అభినందించారు.సమాజంలో ఇలాంటి నిజాయితీ గల వ్యక్తులు ఉండటం గర్వకారణం. సింగే మచ్చేందర్ చేసిన ఈ మంచిపని, బాధ్యతాయుతమైన ప్రవర్తన ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలి.

Sthanikam

నిజాయితీకి నిదర్శనం – తులం బంగారం పోలీసులకు అప్పగించిన యువకుడు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధిలోని తుర్కవర్గాం గ్రామానికి చెందిన సింగే మచ్చేందర్ (తండ్రి: మారెప్ప) నిజాయితీ అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా నిలిచింది.సింగే మచ్చేందర్ కంగ్టి పట్టణంలోని నిర్మల ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం వెళ్లిన సమయంలో అక్కడ ఒక తెలియని కవర్ కనిపించింది. అనుమానం కలిగి ఆ కవర్‌ను తీసి చూడగా అందులో ఒక తులం బంగారం కమ్మలు ఉన్నాయని గమనించాడు. ఆభరణాలు ఎవరో కోల్పోయి ఉంటారని భావించి, స్వార్థపరంగా వ్యవహరించకుండా వెంటనే వాటిని కంగ్టి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు.పోలీసులు ఆ విషయాన్ని స్వీకరించి విచారణ చేపట్టగా, ఆ బంగారం కమ్మలు దుర్గారాజు (తండ్రి: మొగులయ్య) వని గుర్తించారు. వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి వచ్చిన సమయంలో అనుకోకుండా ఆభరణాలు పోగొట్టుకున్నట్లు తెలిసింది.నిజాయితీతో ఆభరణాలు పోలీసులకు అప్పగించిన సింగే మచ్చేందర్‌ను పోలీసు అధికారి శాలువాతో సన్మానించి అభినందించారు.సమాజంలో ఇలాంటి నిజాయితీ గల వ్యక్తులు ఉండటం గర్వకారణం. సింగే మచ్చేందర్ చేసిన ఈ మంచిపని, బాధ్యతాయుతమైన ప్రవర్తన ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News