Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 08, 2026 02:17 AM

నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని శుభాకాంక్షలు

నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని శుభాకాంక్షలు

నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని శుభాకాంక్షలు
February 14, 2026 06:44 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండలంలోని మారవెల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు మన్నే జగదీశ్వర్ జ్యోతి వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంతోషకర వేడుకలో గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దంపతులకు అభినందనలు అందించారు.ఈ సందర్భంగా మాజీ మండల పరిషత్ సభ్యుడు తమ్మన్న,సంగన్న మాట్లాడుతూ, జగదీశ్వర్ పార్టీకి యువతకు ఆదర్శప్రాయుడని, ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్న నాయకుడని పేర్కొన్నారు. సమాజానికి సేవ చేయాలనే తపన, ప్రజల పట్ల అనురాగం ఆయన ప్రత్యేకతలని తెలిపారు.జగదీశ్వర్ జ్యోతి దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించి, ఇలాంటి మరెన్నో వివాహ వార్షికోత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజల ఆశీస్సులు, పార్టీ శ్రేణుల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ వారికి ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News