నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని శుభాకాంక్షలు
నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని శుభాకాంక్షలు
Sthanikam joint District Staff Reporter krishna
సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండలంలోని మారవెల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు మన్నే జగదీశ్వర్ జ్యోతి వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంతోషకర వేడుకలో గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దంపతులకు అభినందనలు అందించారు.ఈ సందర్భంగా మాజీ మండల పరిషత్ సభ్యుడు తమ్మన్న,సంగన్న మాట్లాడుతూ, జగదీశ్వర్ పార్టీకి యువతకు ఆదర్శప్రాయుడని, ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్న నాయకుడని పేర్కొన్నారు. సమాజానికి సేవ చేయాలనే తపన, ప్రజల పట్ల అనురాగం ఆయన ప్రత్యేకతలని తెలిపారు.జగదీశ్వర్ జ్యోతి దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించి, ఇలాంటి మరెన్నో వివాహ వార్షికోత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజల ఆశీస్సులు, పార్టీ శ్రేణుల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ వారికి ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి