నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డ్ దాతాత్రి కాలనీలో వేసవి కాలంలో తలెత్తే తాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ నూతన బోర్వెల్ తవ్వకాలను ప్రారంభించారు. కాలనీలో నీటి కొరతను తగ్గించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 5వ వార్డ్ సభ్యుడు మహేష్, 13వ వార్డ్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, లక్ష్మణ్ కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా హంగీరగా ఉపసర్పంచ్ భాస్కర్, మాజీ ఎంపీటీసీ రాజు, శ్రీనివాస్ గౌడ్ మరియు కాలనీ నివాసులు పాల్గొన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్న సమయంలో బోర్వెల్ తవ్వకం చేపట్టడం అభినందనీయమని స్థానికులు తెలిపారు. ఈ చర్యల ద్వారా కాలనీలో నీటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
PRINT TIME: August 07, 2026 01:15 AM
నీటి సమస్యల నివారణకు ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ ముందడుగు
నీటి సమస్యల నివారణకు ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ ముందడుగు
16-04-2026
63 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డ్ దాతాత్రి కాలనీలో వేసవి కాలంలో తలెత్తే తాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ నూతన బోర్వెల్ తవ్వకాలను ప్రారంభించారు. కాలనీలో నీటి కొరతను తగ్గించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 5వ వార్డ్ సభ్యుడు మహేష్, 13వ వార్డ్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, లక్ష్మణ్ కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా హంగీరగా ఉపసర్పంచ్ భాస్కర్, మాజీ ఎంపీటీసీ రాజు, శ్రీనివాస్ గౌడ్ మరియు కాలనీ నివాసులు పాల్గొన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్న సమయంలో బోర్వెల్ తవ్వకం చేపట్టడం అభినందనీయమని స్థానికులు తెలిపారు. ఈ చర్యల ద్వారా కాలనీలో నీటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి