Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 05:32 AM

నేషనల్ సైన్స్ డే ఘనంగా నిర్వహించిన పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌

నేషనల్ సైన్స్ డే ఘనంగా నిర్వహించిన పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌

నేషనల్ సైన్స్ డే ఘనంగా నిర్వహించిన పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌
February 28, 2026 06:06 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పురపాలక పరిధిలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోడ సుశీల మాట్లాడుతూ నేటి బడి పిల్లలే రేపటి భవిష్యత్ శాస్త్రవేత్తలని పేర్కొన్నారు. విజ్ఞాన శాస్త్రంపైఆసక్తిపెంపొందించుకోవడం ద్వారా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని ఆమె ఆకాంక్షించారు.కార్యక్రమం ప్రారంభంలో నోబెల్ బహుమతి గ్రహీత సి . వి . రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సైన్స్ ఉపాధ్యాయులు “రామన్ ఎఫెక్ట్” గురించి విద్యార్థులకు వివరించారు. శాస్త్రీయ ఆవిష్కరణలు మన దైనందిన జీవితంపై చూపుతున్న ప్రభావాన్ని ఉదాహరణలతో వివరించారు.ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధస్సు అన్ని రంగాల్లో కీలకపాత్రపోషిస్తున్నదనిప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థులు విజ్ఞాన శాస్త్రాన్ని సృజనాత్మకంగా వినియోగించుకుంటే దేశ అభివృద్ధికి తోడ్పడగలరని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వర్షాధారిత సాగు, సేంద్రీయ వ్యవసాయం, వాయు పీడనం, గ్లోబల్ వార్మింగ్, ఆహారపు గొలుసు, ఆక్సిజన్ తయారీ, హైడ్రోజన్తయారీ,సూర్యగ్రహణాలు వంటి ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల సృజనాత్మకతకు ఉపాధ్యాయులు ప్రశంసలు కురిపించారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎ. పద్మజ, కోణం శ్రీనివాస్, సిహెచ్. ప్రసన్న, ఎన్. సరళ, చిలకరాజు శ్రీనివాస్, ఎ. కవిత, ఎన్. సైదులు, జె. మంజుల, ఎండి. సాదిక్, ఎం. సౌమ్య, డి. కుసుమ, పి. తిరుమల, బి. నవీన్, ఎం. హైమావతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News