Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 08:36 AM

నేషనల్ సైన్స్ డే ఘనంగా నిర్వహించిన పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌

నేషనల్ సైన్స్ డే ఘనంగా నిర్వహించిన పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌

నేషనల్ సైన్స్ డే ఘనంగా నిర్వహించిన పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌
February 28, 2026 06:06 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పురపాలక పరిధిలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోడ సుశీల మాట్లాడుతూ నేటి బడి పిల్లలే రేపటి భవిష్యత్ శాస్త్రవేత్తలని పేర్కొన్నారు. విజ్ఞాన శాస్త్రంపైఆసక్తిపెంపొందించుకోవడం ద్వారా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని ఆమె ఆకాంక్షించారు.కార్యక్రమం ప్రారంభంలో నోబెల్ బహుమతి గ్రహీత సి . వి . రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సైన్స్ ఉపాధ్యాయులు “రామన్ ఎఫెక్ట్” గురించి విద్యార్థులకు వివరించారు. శాస్త్రీయ ఆవిష్కరణలు మన దైనందిన జీవితంపై చూపుతున్న ప్రభావాన్ని ఉదాహరణలతో వివరించారు.ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధస్సు అన్ని రంగాల్లో కీలకపాత్రపోషిస్తున్నదనిప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థులు విజ్ఞాన శాస్త్రాన్ని సృజనాత్మకంగా వినియోగించుకుంటే దేశ అభివృద్ధికి తోడ్పడగలరని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వర్షాధారిత సాగు, సేంద్రీయ వ్యవసాయం, వాయు పీడనం, గ్లోబల్ వార్మింగ్, ఆహారపు గొలుసు, ఆక్సిజన్ తయారీ, హైడ్రోజన్తయారీ,సూర్యగ్రహణాలు వంటి ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల సృజనాత్మకతకు ఉపాధ్యాయులు ప్రశంసలు కురిపించారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎ. పద్మజ, కోణం శ్రీనివాస్, సిహెచ్. ప్రసన్న, ఎన్. సరళ, చిలకరాజు శ్రీనివాస్, ఎ. కవిత, ఎన్. సైదులు, జె. మంజుల, ఎండి. సాదిక్, ఎం. సౌమ్య, డి. కుసుమ, పి. తిరుమల, బి. నవీన్, ఎం. హైమావతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News