PRINT TIME: April 21, 2026 10:12 PM
నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించిన జీఎంఆర్ ఫౌండేషన్
నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించిన జీఎంఆర్ ఫౌండేషన్
April 21, 2026 08:33 PM
13 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సిర్గాపూర్ మండలం గౌడ్గామ్ గ్రామానికి చెందిన గోసాయి గంగా బాయి నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి తన సేవా మనసును చాటుకుంది. ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు వారికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సహాయం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమకు ఇది ఎంతో ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, నిరుపేదలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశప్ప బిరాదర్, మస్కురి సాయిలు, మచ్కురి తుకారం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి