Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 08:32 AM

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
February 28, 2026 04:37 PM 243 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల కారణంగా ఆదివారం (01వ తేదీ) ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

తుమ్మలగూడెం సబ్‌స్టేషన్ పరిధిలోని భోగారం, సిరిపురం, తుమ్మలగూడెం గ్రామాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. అలాగే తుమ్మలగూడెం, నిధానపల్లి, భోగారం ప్రాంతాలకు సంబంధించిన వ్యవసాయ విద్యుత్ సరఫరా కూడా ఈ సమయంలో నిలిపివేయబడుతుంది.

లక్ష్మాపురం సబ్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మాపురం, శోభనాద్రిపురం, నీర్నెంల గ్రామాల్లో సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. అదేవిధంగా రామన్నపేట పట్టణంలోని సబ్‌స్టేషన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ సరఫరా నిలిపివేయబడుతుందని అధికారులు వెల్లడించారు.

పనులు పూర్తి అయిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని, వినియోగదారులు సహకరించాలని ఏఈ యం. కోటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News