Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 05:33 AM

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
February 28, 2026 04:37 PM 242 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల కారణంగా ఆదివారం (01వ తేదీ) ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

తుమ్మలగూడెం సబ్‌స్టేషన్ పరిధిలోని భోగారం, సిరిపురం, తుమ్మలగూడెం గ్రామాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. అలాగే తుమ్మలగూడెం, నిధానపల్లి, భోగారం ప్రాంతాలకు సంబంధించిన వ్యవసాయ విద్యుత్ సరఫరా కూడా ఈ సమయంలో నిలిపివేయబడుతుంది.

లక్ష్మాపురం సబ్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మాపురం, శోభనాద్రిపురం, నీర్నెంల గ్రామాల్లో సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. అదేవిధంగా రామన్నపేట పట్టణంలోని సబ్‌స్టేషన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ సరఫరా నిలిపివేయబడుతుందని అధికారులు వెల్లడించారు.

పనులు పూర్తి అయిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని, వినియోగదారులు సహకరించాలని ఏఈ యం. కోటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News