Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 28, 2026 06:14 PM

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
February 28, 2026 04:37 PM 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

రామన్నపేట: నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల కారణంగా ఆదివారం (01వ తేదీ) ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

తుమ్మలగూడెం సబ్‌స్టేషన్ పరిధిలోని భోగారం, సిరిపురం, తుమ్మలగూడెం గ్రామాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. అలాగే తుమ్మలగూడెం, నిధానపల్లి, భోగారం ప్రాంతాలకు సంబంధించిన వ్యవసాయ విద్యుత్ సరఫరా కూడా ఈ సమయంలో నిలిపివేయబడుతుంది.

లక్ష్మాపురం సబ్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మాపురం, శోభనాద్రిపురం, నీర్నెంల గ్రామాల్లో సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. అదేవిధంగా రామన్నపేట పట్టణంలోని సబ్‌స్టేషన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ సరఫరా నిలిపివేయబడుతుందని అధికారులు వెల్లడించారు.

పనులు పూర్తి అయిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని, వినియోగదారులు సహకరించాలని ఏఈ యం. కోటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News