నవభారత్ కళాశాలలో నేడు సైన్స్ దినోత్సవం ‘విద్యావిధానంలో శాస్త్రీయ దృక్పథం’పై సదస్సు భువనగిరి: జిల్లా కేంద్రంలోని నవభారత్ డిగ్రీ అండ్
నవభారత్ కళాశాలలో నేడు సైన్స్ దినోత్సవం ‘విద్యావిధానంలో శాస్త్రీయ దృక్పథం’పై సదస్సు భువనగిరి: జిల్లా కేంద్రంలోని నవభారత్ డిగ్రీ అండ్
స్థానికం బృందం
భువనగిరి: జిల్లా కేంద్రంలోని నవభారత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో శుక్రవారం సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు జన విజ్ఞాన వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా భాస్కర్ రెడ్డి తెలిపారు.
‘విద్యావిధానంలో శాస్త్రీయ దృక్పథం’ అనే అంశంపై జరిగే సదస్సులో జన విజ్ఞాన వేదిక జాతీయ కన్వీనర్ మువ్వా రామారావు, గ్రంథాలయ ఉద్యమ సంస్థ తెలంగాణ కన్వీనర్ ప్రభాకర్ చారి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి కందుకూరి సుదర్శన్, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించనున్నారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ మేజిక్ ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి