నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతికి టీజీఈ జేఏసీ వినతిపత్రం
నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతికి టీజీఈ జేఏసీ వినతిపత్రం
Krishna
నారాయణఖేడ్లో తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఉమా హారతికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారమైనప్పటికీ ఇంకా పలు కీలక సమస్యలు అలాగే ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భోజన విరామ సమయంలో డివిజన్, మండల కేంద్రాల్లో ఆర్డీవోలు, తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. ముఖ్యంగా జూన్ 2 నాటికి పీఆర్సీ అమలు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, హెల్త్ కార్డుల అమలు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ, పెండింగ్ డీఏల విడుదల, వీఆర్ఏల సమస్యల పరిష్కారం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించడం, సాధారణ బదిలీలు చేపట్టడం వంటి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఈ జేఏసీ నాయకులు, తహసీల్దార్ హసీనా బేగం, వివిధ స్థాయి బాధ్యులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి