Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 08, 2026 12:18 AM

నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా బేటీ జన్మోత్సవం

నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా బేటీ జన్మోత్సవం

నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా బేటీ జన్మోత్సవం
March 16, 2026 08:18 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో,మహిళా సాధికారత కేంద్రం సహకారంతో బేటీ జన్మోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో పుట్టిన ఆడ శిశువులను గౌరవిస్తూ బేటీ జన్మోత్సవ కిట్లు మరియు ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు.బాలిక జననాన్ని ఆనందంగా జరుపుకోవడం ద్వారా సమాజంలో బాలికల పట్ల గౌరవం మరియు ప్రోత్సాహం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో పథకం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.అలాగే పని చేసే ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపులను నివారించేందుకు అమలు చేస్తున్న పోష్ చట్టం (POSH) గురించి కూడా వివరించారు.మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండి అవసరమైన సమయంలో చట్టపరమైన సహాయం పొందాలని సూచించారు. అదేవిధంగా బేటీ జన్మోత్సవం సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సందేశం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి మాట్లాడుతూ,బాలికల రక్షణ, విద్య మరియు సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఎంతో ముఖ్యమని తెలిపారు. బాలిక పుట్టినప్పటి నుండి ఆమెకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందని చెప్పారు.సమాజంలో బాలికల పట్ల వివక్ష లేకుండా అందరూ సమానంగా చూడాలని ఆమె కోరారు.ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ, ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు మరియు మహిళలకు అవసరమైన వైద్య సేవలు, రక్షణ మరియు ఇతర సదుపాయాలను సమయానికి అందిస్తున్నామని తెలిపారు.మహిళల ఆరోగ్యం మరియు శిశువుల సంరక్షణ తమ ప్రధాన బాధ్యతగా భావిస్తూ అన్ని విధాలుగా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.నారాయణఖేడ్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సీడీపీఓ శ్రీమతి సుజాత మాట్లాడుతూ,గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పోషకాహారం, గర్భధారణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు,అలాగే చిన్నపిల్లల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.పిల్లలను క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి,రీజినల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనురాధ, నారాయణఖేడ్ సబ్ ఇన్‌స్పెక్టర్ మొగులయ్య, కానిస్టేబుల్, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది,ఆసుపత్రి సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News