Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 11:05 AM

నారాయణఖేడ్ విద్యార్థినికి స్వర్ణ కిరీటం – సబ్ కలెక్టర్ చేతుల మీదుగా ఘన సత్కారం

నారాయణఖేడ్ విద్యార్థినికి స్వర్ణ కిరీటం – సబ్ కలెక్టర్ చేతుల మీదుగా ఘన సత్కారం

నారాయణఖేడ్ విద్యార్థినికి స్వర్ణ కిరీటం – సబ్ కలెక్టర్ చేతుల మీదుగా ఘన సత్కారం
February 27, 2026 08:34 AM 198 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణానికి మరో గౌరవకరమైన ఘనత దక్కింది. తెలంగాణ హిందీ ప్రచార సభ మరియు హిందీ సేవా సదన్ మహా విద్యాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందీ ప్రతిభా పరీక్షల్లో నారాయణఖేడ్ పట్టణంలోని వాటికన్ పాఠశాలకు చెందిన విద్యార్థిని యం. సౌజన్య ప్రతిభ కనబరచి స్వర్ణ పతకాన్ని సాధించారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ చేతుల మీదుగా స్వర్ణ పతకం మరియు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. ఈ విషయం గురించి సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. రాంచందర్ వెల్లడించారు. హిందీ భాష పట్ల ఆసక్తి పెంపొందించడానికి, విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి పరీక్షలు ఎంతో దోహదపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఇతర విద్యార్థులకు కూడా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హిందీ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. రాంచందర్, ట్రస్మా అధ్యక్షులు కుమ్మరి ప్రకాష్, వాటికన్ పాఠశాల ప్రిన్సిపాల్ కె. రమేష్ తదితరులు పాల్గొన్నారు.స్వర్ణ పతకం సాధించిన విద్యార్థిని సౌజన్యను పాఠశాల డైరెక్టర్ ప్రశాంత్, ప్రిన్సిపాల్ రమేష్, కరస్పాండెంట్ మారుతి, వైస్ ప్రిన్సిపాల్ రాధిక మరియు ఉపాధ్యాయ బృందం అభినందిస్తూ ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.అలాగే హన్మంతరావు పేట గ్రామస్థులు సౌజన్య సాధించిన ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె సాధించిన ఈ గౌరవం పాఠశాలకు, గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు.హిందీ ప్రతిభా పరీక్షల్లో ప్రతిభ కనబరచి స్వర్ణ పతకం సాధించడం ద్వారా సౌజన్య ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. ఈ విజయంతో నారాయణఖేడ్ ప్రాంతం మరోసారి విద్యారంగంలో తన ప్రతిభను చాటుకుంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News