నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షుడిగా రవీందర్ నియామకం
నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షుడిగా రవీందర్ నియామకం
Sthanikam joint District Staff Reporter krishna
హైదరాబాద్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరై సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన మరియు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొని బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.అనంతరం మానూర్ మండల కేంద్రానికి చెందిన రవీందర్ను నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షుడిగా నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్ మాట్లాడుతూ సంస్థ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి, జిల్లా అధ్యక్షుడు బైండ్ల కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు మరియు ఇతర నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి