Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:11 AM

నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షుడిగా రవీందర్ నియామకం

నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షుడిగా రవీందర్ నియామకం

నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షుడిగా రవీందర్ నియామకం
12-03-2026 410 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్‌లో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరై సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన మరియు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొని బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.అనంతరం మానూర్ మండల కేంద్రానికి చెందిన రవీందర్‌ను నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షుడిగా నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్ మాట్లాడుతూ సంస్థ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి, జిల్లా అధ్యక్షుడు బైండ్ల కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు మరియు ఇతర నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షుడిగా రవీందర్ నియామకం

Article Image

హైదరాబాద్‌లో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరై సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన మరియు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొని బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.అనంతరం మానూర్ మండల కేంద్రానికి చెందిన రవీందర్‌ను నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షుడిగా నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్ మాట్లాడుతూ సంస్థ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి, జిల్లా అధ్యక్షుడు బైండ్ల కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు మరియు ఇతర నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News