Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:14 PM

నారాయణఖేడ్ ఆసుపత్రిలో అభివృద్ధి సొసైటీ సమావేశం… వైద్య సేవలపై ఎమ్మెల్యే సమీక్ష

నారాయణఖేడ్ ఆసుపత్రిలో అభివృద్ధి సొసైటీ సమావేశం… వైద్య సేవలపై ఎమ్మెల్యే సమీక్ష

నారాయణఖేడ్ ఆసుపత్రిలో అభివృద్ధి సొసైటీ సమావేశం… వైద్య సేవలపై ఎమ్మెల్యే సమీక్ష
April 15, 2026 06:16 PM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో బుధవారం నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొంటూ, ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. మందుల సరఫరా సమృద్ధిగా ఉండేలా చూసుకోవడం, పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, అవసరమైన ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులో ఉంచడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ప్రభుత్వ ఆసుపత్రులపై పేద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం వైద్యుల బాధ్యత అని పేర్కొంటూ, డాక్టర్లు మరియు సిబ్బంది సమయపాలన పాటిస్తూ నిబద్ధతతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ నిధులను నిబంధనల ప్రకారం వినియోగించి అత్యవసర సేవలను మెరుగుపరచాలని తెలిపారు. అలాగే మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కీలకమని వివరిస్తూ, 9 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు ఈ టీకా అందించడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చని చెప్పారు. ఈ టీకాపై ప్రజల్లో అవగాహన పెంచి అర్హులైన ప్రతి బాలికకు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్, వైద్యులు, కమిటీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News