PRINT TIME: March 11, 2026 06:02 PM
నారాయణఖేడ్ అభివృద్ధిపై మంత్రులతో చర్చించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్ అభివృద్ధిపై మంత్రులతో చర్చించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
March 11, 2026 04:00 PM
23 Views
స్థానికం ప్రతినిధి :
Sangareddy & Manoor
Sthanikam joint District Staff Reporter krishna
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన వేసవి కాలం బడ్జెట్ సమావేశాలు విజయవంతంగా ముగిసిన అనంతరం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్య అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, విద్య, ఆరోగ్య రంగాల పురోగతిపై చర్చించారు.అలాగే నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం ఇవ్వాలని, కొత్త ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సహకారం అందించాలని మంత్రులను విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి