Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 05:33 AM

నర్సీపట్నం ఆదివాసి గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలి

నర్సీపట్నం ఆదివాసి గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలి

నర్సీపట్నం ఆదివాసి గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలి
February 28, 2026 06:40 PM 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నర్సీపట్నం: అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం పరిసర ఆదివాసి గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వి. శంకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి భూములను బలవంతంగా ఖాళీ చేయించి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాన్ని ఖండించారు.

ఆదివాసి హక్కుల పరిరక్షణ కోసం కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చిన ఆయన, అటవీ హక్కుల చట్ట సవరణలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. చటర్జీపురం ఆదివాసీలపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగార్రావు మాట్లాడుతూ, ఆదివాసీ హక్కుల సాధన కోసం మార్చి 30న నర్సీపట్నంలో “ఛలో ఆర్డీఓ” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు డి. హరినాథ్ మాట్లాడుతూ, ఆదివాసి భూముల రక్షణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఉదయ్ కిరణ్, కే. జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. 21 మందితో జిల్లా కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. జిల్లా కార్యదర్శిగా కోసూరి రాజు ఎన్నికయ్యారు. సమావేశంలో కేదారి దేవి, కె. సత్య, కడారి రాజేశ్వరి, తురె రవి, కేదారి రాజు, బాలరాజు, పవన్ కుమార్, గెమిలిచంటి రాజు తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News