నర్సీపట్నం ఆదివాసి గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలి
నర్సీపట్నం ఆదివాసి గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలి
GADDAM JAGANMOHAN REDDY
నర్సీపట్నం: అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం పరిసర ఆదివాసి గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ పోలిట్బ్యూరో సభ్యుడు వి. శంకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి భూములను బలవంతంగా ఖాళీ చేయించి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాన్ని ఖండించారు.
ఆదివాసి హక్కుల పరిరక్షణ కోసం కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చిన ఆయన, అటవీ హక్కుల చట్ట సవరణలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. చటర్జీపురం ఆదివాసీలపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగార్రావు మాట్లాడుతూ, ఆదివాసీ హక్కుల సాధన కోసం మార్చి 30న నర్సీపట్నంలో “ఛలో ఆర్డీఓ” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు డి. హరినాథ్ మాట్లాడుతూ, ఆదివాసి భూముల రక్షణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఉదయ్ కిరణ్, కే. జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. 21 మందితో జిల్లా కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. జిల్లా కార్యదర్శిగా కోసూరి రాజు ఎన్నికయ్యారు. సమావేశంలో కేదారి దేవి, కె. సత్య, కడారి రాజేశ్వరి, తురె రవి, కేదారి రాజు, బాలరాజు, పవన్ కుమార్, గెమిలిచంటి రాజు తదితరులు హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి