Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ అండర్ పాస్ మంజూరు హర్షణీయం ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 23, 2026 09:52 PM

నర్సాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలు: కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు

నర్సాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలు: కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు

నర్సాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలు: కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు
February 16, 2026 09:52 AM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నర్సాపూర్ మున్సిపాలిటీలో ఈరోజు జరుగనున్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల నేపథ్యంలో నర్సాపూర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టబడ్డాయి. ప్రజాస్వామ్య ప్రక్రియను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయబడినట్లు తెలియజేస్తున్నాము.ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేయబడతాయి. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న రహదారులు 200 మీటర్ల దూరంలోనే తాత్కాలికంగా బ్లాక్ చేయబడతాయి. ఎన్నికైన గౌరవ సభ్యులు మరియు డిపిఆర్ఓ ద్వారా అధికారిక అనుమతి పొందిన ప్రెస్ ప్రతినిధులకు మాత్రమే 200 మీటర్ల పరిధిలోకి ప్రవేశం కల్పించబడుతుంది.సాధారణ ప్రజలు అనవసరంగా ఆ ప్రాంతానికి రాకుండా, పోలీసు శాఖకు సహకరించవలసిందిగా నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి మనవి. ఈ చర్యలు ప్రజల భద్రత మరియు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు మాత్రమే చేపట్టబడుతున్నాయి.అలాగే కాగజ్ మద్దూర్ రూట్ వైపు వెళ్లే వాహనదారులు దయచేసి పోస్టాఫీస్ రూట్ ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగించగలరు. ట్రాఫిక్ మార్పులపై పోలీసులు ఇచ్చే సూచనలను గౌరవించి, సహకరించగలరు.నర్సాపూర్ పట్టణ ప్రజలందరూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములై, పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News