నర్సాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలు: కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు
నర్సాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలు: కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు
Krishna
నర్సాపూర్ మున్సిపాలిటీలో ఈరోజు జరుగనున్న మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల నేపథ్యంలో నర్సాపూర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టబడ్డాయి. ప్రజాస్వామ్య ప్రక్రియను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయబడినట్లు తెలియజేస్తున్నాము.ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేయబడతాయి. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న రహదారులు 200 మీటర్ల దూరంలోనే తాత్కాలికంగా బ్లాక్ చేయబడతాయి. ఎన్నికైన గౌరవ సభ్యులు మరియు డిపిఆర్ఓ ద్వారా అధికారిక అనుమతి పొందిన ప్రెస్ ప్రతినిధులకు మాత్రమే 200 మీటర్ల పరిధిలోకి ప్రవేశం కల్పించబడుతుంది.సాధారణ ప్రజలు అనవసరంగా ఆ ప్రాంతానికి రాకుండా, పోలీసు శాఖకు సహకరించవలసిందిగా నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి మనవి. ఈ చర్యలు ప్రజల భద్రత మరియు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు మాత్రమే చేపట్టబడుతున్నాయి.అలాగే కాగజ్ మద్దూర్ రూట్ వైపు వెళ్లే వాహనదారులు దయచేసి పోస్టాఫీస్ రూట్ ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగించగలరు. ట్రాఫిక్ మార్పులపై పోలీసులు ఇచ్చే సూచనలను గౌరవించి, సహకరించగలరు.నర్సాపూర్ పట్టణ ప్రజలందరూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములై, పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి