Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంగన్‌వాడీ సేవల బలోపేతానికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ – ఎమ్మెల్యే సంజీవరెడ్డి పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 07:50 PM

నార్కట్‌పల్లిలో మైనర్లకు పొగాకు అమ్మితే కఠిన చర్యలు

నార్కట్‌పల్లిలో మైనర్లకు పొగాకు అమ్మితే కఠిన చర్యలు

నార్కట్‌పల్లిలో మైనర్లకు పొగాకు అమ్మితే కఠిన చర్యలు
March 02, 2026 08:18 PM 292 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పాఠశాలల పరిసరాల్లో 100 మీటర్ల లోపల విక్రయాలు నిషేధం ఎస్సై విష్ణుమూర్తి హెచ్చరిక

ప్రమాదాల నివారణకు చౌరస్తాలో జాగ్ బారికేడ్లు ఏర్పాటు

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలో మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం నాడు నార్కట్‌పల్లి ఎస్ ఐ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో స్థానిక కిరాణా దుకాణాలు, పాన్‌షాపుల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.పాఠశాలల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయం పూర్తిగా నిషేధమని, మైనర్లకు సిగరెట్లు, గుట్కా, ఖైనీ తదితర పదార్థాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాఠశాలల సమీపంలోని దుకాణదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు.ఇదిలా ఉండగా, నార్కట్‌పల్లి చౌరస్తాలో గతంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ వాహనాల నియంత్రణకు జాగ్ బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. సరైన సూచిక బోర్డులు లేకపోవడం, అతివేగం కారణంగా ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన బారికేడ్లు ప్రమాదాల నివారణకు దోహదపడతాయని,వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు.ప్రజల సహకారంతో నార్కట్‌పల్లిలో చట్టవ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఎస్సై విష్ణుమూర్తి తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News