నార్కట్పల్లిలో మైనర్లకు పొగాకు అమ్మితే కఠిన చర్యలు
నార్కట్పల్లిలో మైనర్లకు పొగాకు అమ్మితే కఠిన చర్యలు
Komidala Mahender reddy
పాఠశాలల పరిసరాల్లో 100 మీటర్ల లోపల విక్రయాలు నిషేధం ఎస్సై విష్ణుమూర్తి హెచ్చరిక
ప్రమాదాల నివారణకు చౌరస్తాలో జాగ్ బారికేడ్లు ఏర్పాటు
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలో మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం నాడు నార్కట్పల్లి ఎస్ ఐ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో స్థానిక కిరాణా దుకాణాలు, పాన్షాపుల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.పాఠశాలల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయం పూర్తిగా నిషేధమని, మైనర్లకు సిగరెట్లు, గుట్కా, ఖైనీ తదితర పదార్థాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాఠశాలల సమీపంలోని దుకాణదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు.ఇదిలా ఉండగా, నార్కట్పల్లి చౌరస్తాలో గతంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ వాహనాల నియంత్రణకు జాగ్ బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. సరైన సూచిక బోర్డులు లేకపోవడం, అతివేగం కారణంగా ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన బారికేడ్లు ప్రమాదాల నివారణకు దోహదపడతాయని,వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు.ప్రజల సహకారంతో నార్కట్పల్లిలో చట్టవ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఎస్సై విష్ణుమూర్తి తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి