Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:49 PM

నార్కట్‌పల్లిలో అఖిలపక్షం ధర్నా మృతుల కుటుంబాలకు కోటి పరిహారం డిమాండ్ – పోలీసులతో తోపులాట

నార్కట్‌పల్లిలో అఖిలపక్షం ధర్నా మృతుల కుటుంబాలకు కోటి పరిహారం డిమాండ్ – పోలీసులతో తోపులాట

నార్కట్‌పల్లిలో అఖిలపక్షం ధర్నా మృతుల కుటుంబాలకు కోటి పరిహారం డిమాండ్ – పోలీసులతో తోపులాట
27-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నార్కట్‌పల్లి, మండల కేంద్రంలోని నల్గొండ చౌరస్తా వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంపై శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా జరిగింది. అసంపూర్తిగా ఉన్న రహదారి నుంచి అతివేగంగా వచ్చిన లారీ షాపులపైకి దూసుకెళ్లడంతో చోటుచేసుకున్న ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

రోడ్డు మీద కూర్చొని నిరసన తెలుపుతుండగా పోలీసులు వారిని లేపేందుకు ప్రయత్నించడంతో కొంతసేపు తోపులాట జరిగింది. అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చింది.

అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా రోడ్డు వెడల్పు పనులు నిలిచిపోవడంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సంబంధిత శాఖ నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని విమర్శించారు. మృతుల కుటుంబాలను ఇప్పటివరకు ప్రభుత్వ ప్రతినిధులు పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, నార్కట్‌పల్లిలో అసంపూర్తిగా ఉన్న రహదారి పనులను తక్షణమే పూర్తి చేసి గ్రామాల కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

ధర్నాలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, బీజేపీ మండల అధ్యక్షుడు మెడబోయిన శ్రీనివాస్ యాదవ్, నోముల నాగరాజు, వడ్డేపల్లి నాగరాజు, ఎడ్ల మహాలింగం, నడింపల్లి శ్రవణ్ కుమార్, నీళ్లకంటి శ్రీకాంత్, మహేందర్, వడ్డగోని రామలింగం, పాలకూర రమేష్, మాదాసు నరేష్, గోదాల వెంకట్ రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నార్కట్‌పల్లిలో అఖిలపక్షం ధర్నా మృతుల కుటుంబాలకు కోటి పరిహారం డిమాండ్ – పోలీసులతో తోపులాట

Article Image

నార్కట్‌పల్లి, మండల కేంద్రంలోని నల్గొండ చౌరస్తా వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంపై శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా జరిగింది. అసంపూర్తిగా ఉన్న రహదారి నుంచి అతివేగంగా వచ్చిన లారీ షాపులపైకి దూసుకెళ్లడంతో చోటుచేసుకున్న ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

రోడ్డు మీద కూర్చొని నిరసన తెలుపుతుండగా పోలీసులు వారిని లేపేందుకు ప్రయత్నించడంతో కొంతసేపు తోపులాట జరిగింది. అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చింది.

అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా రోడ్డు వెడల్పు పనులు నిలిచిపోవడంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సంబంధిత శాఖ నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని విమర్శించారు. మృతుల కుటుంబాలను ఇప్పటివరకు ప్రభుత్వ ప్రతినిధులు పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, నార్కట్‌పల్లిలో అసంపూర్తిగా ఉన్న రహదారి పనులను తక్షణమే పూర్తి చేసి గ్రామాల కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

ధర్నాలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, బీజేపీ మండల అధ్యక్షుడు మెడబోయిన శ్రీనివాస్ యాదవ్, నోముల నాగరాజు, వడ్డేపల్లి నాగరాజు, ఎడ్ల మహాలింగం, నడింపల్లి శ్రవణ్ కుమార్, నీళ్లకంటి శ్రీకాంత్, మహేందర్, వడ్డగోని రామలింగం, పాలకూర రమేష్, మాదాసు నరేష్, గోదాల వెంకట్ రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News