PRINT TIME: June 22, 2026 01:02 PM
నల్లపోచమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు.. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు
నల్లపోచమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు.. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు
April 26, 2026 06:54 PM
180 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు ఆదివారాల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి ఆదివారం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ఎస్సై కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పర్యవేక్షించారు. ఆలయ పరిసరాల్లో శాంతిభద్రతలు కట్టుదిట్టంగా నిర్వహిస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పించారు.ఈ కార్యక్రమంలో సంబంధించిన పోలీస్ అధికారులు ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి