Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:17 AM

నల్లపోచమ్మ అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు

నల్లపోచమ్మ అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు

నల్లపోచమ్మ అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
26-04-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల బోరంచ గ్రామ శివారులో మంజీరా నది తీరాన వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు ఆదివారాల మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి ఆదివారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు నైవేద్యాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణ అంతా భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.మహోత్సవాల సందర్భంగా ఆలయ అర్చకులు నాగేష్ స్వామి ప్రత్యేక అభిషేకాలు, అలంకార పూజలు నిర్వహించి అమ్మవారికి మహామంగళహారతి ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని భక్తి పరవశంలో తరిశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, తాగునీరు, ప్రసాదం, దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు.స్థానిక పోలీసులు భద్రతా చర్యలు చేపట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించారు. ఏడు ఆదివారాల పాటు కొనసాగే ఈ మహోత్సవాలకు మరింత భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి, సిద్దు స్వామి, ప్రవీణ్ స్వామి, దేవస్థానం అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, ఆరోగ్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నల్లపోచమ్మ అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల బోరంచ గ్రామ శివారులో మంజీరా నది తీరాన వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు ఆదివారాల మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి ఆదివారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు నైవేద్యాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణ అంతా భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.మహోత్సవాల సందర్భంగా ఆలయ అర్చకులు నాగేష్ స్వామి ప్రత్యేక అభిషేకాలు, అలంకార పూజలు నిర్వహించి అమ్మవారికి మహామంగళహారతి ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని భక్తి పరవశంలో తరిశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, తాగునీరు, ప్రసాదం, దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు.స్థానిక పోలీసులు భద్రతా చర్యలు చేపట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించారు. ఏడు ఆదివారాల పాటు కొనసాగే ఈ మహోత్సవాలకు మరింత భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి, సిద్దు స్వామి, ప్రవీణ్ స్వామి, దేవస్థానం అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, ఆరోగ్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News