నల్లపోచమ్మ అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
నల్లపోచమ్మ అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల బోరంచ గ్రామ శివారులో మంజీరా నది తీరాన వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు ఆదివారాల మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి ఆదివారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు నైవేద్యాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణ అంతా భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.మహోత్సవాల సందర్భంగా ఆలయ అర్చకులు నాగేష్ స్వామి ప్రత్యేక అభిషేకాలు, అలంకార పూజలు నిర్వహించి అమ్మవారికి మహామంగళహారతి ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని భక్తి పరవశంలో తరిశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, తాగునీరు, ప్రసాదం, దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు.స్థానిక పోలీసులు భద్రతా చర్యలు చేపట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించారు. ఏడు ఆదివారాల పాటు కొనసాగే ఈ మహోత్సవాలకు మరింత భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి, సిద్దు స్వామి, ప్రవీణ్ స్వామి, దేవస్థానం అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, ఆరోగ్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి