PRINT TIME: June 22, 2026 02:17 PM
నల్ల బ్యాడ్జిలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన, శంకర్ గౌడ్కు ఘన నివాళి
నల్ల బ్యాడ్జిలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన, శంకర్ గౌడ్కు ఘన నివాళి
April 24, 2026 11:13 AM
154 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
రాష్ట్ర వ్ప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడవ రోజుకు చేరుకున్న సందర్భంగా వరంగల్ డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆకస్మిక మరణం కార్మికుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల సంతాపంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపో ఉద్యోగులు డిపో ఎదుట భారీగా చేరుకుని నల్ల బ్యాడ్జిలు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదు నిమిషాల పాటు మౌనం పాటిస్తూ శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఉద్యోగులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు. సమ్మె నేపథ్యంలో కార్మికుల ఐక్యత స్పష్టంగా కనిపించగా, తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి