నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర సందర్శన
నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర సందర్శన
స్థానికం బృందం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధనలకు ప్రత్యక్ష పరిచయం
నల్గొండ, నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు ఫీల్డ్ విజిట్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించారు. విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఫిజిక్స్లో జరుగుతున్న శాస్త్రీయ పరిశోధనలను విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు.
పరిశోధనా ప్రయోగశాలలను డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో సందర్శించి, ఆధునిక పరికరాల వినియోగం, పరిశోధన విధానాలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ భౌతిక శాస్త్రాన్ని పరిశీలనాత్మక దృక్కోణంలో అధ్యయనం చేస్తే లోతైన జ్ఞానం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉన్నత విద్య, పరిశోధనల ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు.
అనంతరం విశ్వవిద్యాలయంలోని విస్తృత గ్రంథాలయాన్ని సందర్శించిన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భౌతిక శాస్త్ర విభాగాధిపతి ఎం. శ్రీనివాస్ రెడ్డి, ఉపన్యాసకులు వెంకట్ రెడ్డి, డాక్టర్ వి. వెంకటేశం, మన్నెం వెంకటయ్య, శశికళ పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి