నడిమిపల్లిలో అప్పుడే పుట్టిన మగ శిశువు వదిలివేత – హిందూపురం ఆస్పత్రిలో చికిత్స
నడిమిపల్లిలో అప్పుడే పుట్టిన మగ శిశువు వదిలివేత – హిందూపురం ఆస్పత్రిలో చికిత్స
EDIGA NAVEENKUMAR
సోమందేపల్లి, ఫిబ్రవరి 28: మండలంలోని నడిమిపల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన ఘటన కలకలం రేపింది. ఉదయం సుమారు 5 గంటల సమయంలో గ్రామస్తులకు శిశువు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిశువును రక్షించారు. సీడీపీవో ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్త, ఆశా వర్కర్, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. అనంతరం శిశువును ఆరోగ్య పరీక్షల నిమిత్తం హిందూపురం ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
ప్రస్తుతం శిశువు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ప్రాథమిక పరీక్షల్లో ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించినప్పటికీ, మరొక రోజు పాటు పరిశీలనలో ఉంచాలని సూచించినట్లు సమాచారం.
ఈ ఘటనపై సోమందేపల్లి పోలీస్ స్టేషన్ లో ‘వదిలివేయబడిన శిశువు’గా జీడీఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయాన్ని బాలల సంరక్షణ విభాగం ద్వారా బాలల సంక్షేమ సమితికి తెలియజేశారు. ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అనంతరం శిశువును సమితి ముందు ప్రవేశపెట్టి, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి