Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:00 AM

నడిమిపల్లిలో అప్పుడే పుట్టిన మగ శిశువు వదిలివేత – హిందూపురం ఆస్పత్రిలో చికిత్స

నడిమిపల్లిలో అప్పుడే పుట్టిన మగ శిశువు వదిలివేత – హిందూపురం ఆస్పత్రిలో చికిత్స

నడిమిపల్లిలో అప్పుడే పుట్టిన మగ శిశువు వదిలివేత – హిందూపురం ఆస్పత్రిలో చికిత్స
28-02-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి, ఫిబ్రవరి 28: మండలంలోని నడిమిపల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన ఘటన కలకలం రేపింది. ఉదయం సుమారు 5 గంటల సమయంలో గ్రామస్తులకు శిశువు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిశువును రక్షించారు. సీడీపీవో ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్త, ఆశా వర్కర్, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. అనంతరం శిశువును ఆరోగ్య పరీక్షల నిమిత్తం హిందూపురం ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

ప్రస్తుతం శిశువు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ప్రాథమిక పరీక్షల్లో ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించినప్పటికీ, మరొక రోజు పాటు పరిశీలనలో ఉంచాలని సూచించినట్లు సమాచారం.

ఈ ఘటనపై సోమందేపల్లి పోలీస్ స్టేషన్ లో ‘వదిలివేయబడిన శిశువు’గా జీడీఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయాన్ని బాలల సంరక్షణ విభాగం ద్వారా బాలల సంక్షేమ సమితికి తెలియజేశారు. ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అనంతరం శిశువును సమితి ముందు ప్రవేశపెట్టి, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.



Sthanikam

నడిమిపల్లిలో అప్పుడే పుట్టిన మగ శిశువు వదిలివేత – హిందూపురం ఆస్పత్రిలో చికిత్స

Article Image

సోమందేపల్లి, ఫిబ్రవరి 28: మండలంలోని నడిమిపల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన ఘటన కలకలం రేపింది. ఉదయం సుమారు 5 గంటల సమయంలో గ్రామస్తులకు శిశువు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిశువును రక్షించారు. సీడీపీవో ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్త, ఆశా వర్కర్, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. అనంతరం శిశువును ఆరోగ్య పరీక్షల నిమిత్తం హిందూపురం ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

ప్రస్తుతం శిశువు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ప్రాథమిక పరీక్షల్లో ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించినప్పటికీ, మరొక రోజు పాటు పరిశీలనలో ఉంచాలని సూచించినట్లు సమాచారం.

ఈ ఘటనపై సోమందేపల్లి పోలీస్ స్టేషన్ లో ‘వదిలివేయబడిన శిశువు’గా జీడీఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయాన్ని బాలల సంరక్షణ విభాగం ద్వారా బాలల సంక్షేమ సమితికి తెలియజేశారు. ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అనంతరం శిశువును సమితి ముందు ప్రవేశపెట్టి, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News