Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాలుజారి బావిలో పడిన బాలికలు.. కాపాడబోయిన తల్లితో సహా ముగ్గురు దుర్మరణం సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 11:17 PM

ముస్లిం సోదరులకు అల్పాహారం, మంచినీటి పంపిణీ

ముస్లిం సోదరులకు అల్పాహారం, మంచినీటి పంపిణీ

ముస్లిం సోదరులకు అల్పాహారం, మంచినీటి పంపిణీ
March 21, 2026 06:41 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్లగొండలో ఘనంగా రంజాన్ ప్రార్థనలు.. పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం

​నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని మునుగోడు రోడ్డులో గల ఈద్గా మసీదు వద్ద శనివారం రంజాన్ పవిత్ర ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం, అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షలు,వన్ టౌన్ సీఐ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

​ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, అడ్వకేట్ కట్టెల శివకుమార్ మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేయడం అభినందనీయమన్నారు. గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీకగా హిందూ ముస్లింలు సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, టౌన్ సి.ఐ. ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, శాంతియుత సంఘం ప్రతినిధి ఆఫీస్ ఖాన్, పెన్షనర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి భిక్షపతి, మైనార్టీ వెల్ఫేర్ జిల్లా నాయకులు డాక్టర్ ఏ.ఏ. ఖాన్, బీఎంపీ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ నజీరుద్దీన్, బీఎస్పీ సీనియర్ నాయకులు ఎండి. మసీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

​మరియు సంఘం నాయకులు కట్టెల రాములు, బండారు శంకర్, ఇరిగి భిక్షం, కొండేటి నరేష్ కుమార్, కందుల విజయ్ కుమార్, బాకీ తరుణ్, అల్లంపల్లి కొండన్న, మోత్కూరి కార్తీక్, ఈరిగి సిద్దు, గోపి నాయక్, కందుల సంపత్ తదితరులు ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా అతిథులు నల్లగొండ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News